చికెన్ లేదన్నాడని దాబానే తగలబెట్టారు..
చికెన్ లేదన్నాడని ఏకంగా దాబానే తగలబెట్టేశారు ఆ ఘనులు. చికెన్ అంటే వారికున్న పిచ్చి ఆ దాబా ఓనర్ పాలిట విషాదంగా మారింది. తాగిన మత్తులో దాబాకు నిప్పంటించేశారు. ఆదివారం మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
చికెన్ లేదన్నాడని ఏకంగా దాబానే తగలబెట్టేశారు ఆ ఘనులు. చికెన్ అంటే వారికున్న పిచ్చి ఆ దాబా ఓనర్ పాలిట విషాదంగా మారింది. తాగిన మత్తులో దాబాకు నిప్పంటించేశారు. ఆదివారం మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాలు.. శంకర్ టైడే(29), సాగర్ పటేల్(19) అనే ఇద్దరు చికెన్ ప్రేమికులు.. ఫుల్గా మద్యం సేవించారు. తాగుతూ, ఊగుతూ అర్దరాత్రి ఒంటిగంట టైంలో బెల్టారోడి ప్రాంతంలోని రోడ్డుపక్కన ఉన్న ఓ దాబా హోటల్కు వెళ్లారు.
అక్కడ తమకు చికెన్ ఐటమ్ కావాలంటూ ఆర్డర్ చేశారు. అయితే అప్పటికే ఆ దాబాలో చికెన్ అయిపోంది. ఇదే విషయాన్ని దాబా ఓనర్ వారికి చెప్పి, చికెన్ దొరకదని అన్నాడు. తాగిన మత్తులో ఉన్నశంకర్, సాగర్లు దీన్ని ఒప్పుకోలేదు. తమకు చికెన్ కావాల్సిందేనని దాబా ఓనర్తో వాదనకు దిగారు.
ఈ గొడవ ముదరడంతో ఆవేశానికి లోనైన వీరిద్దరు దాబాకు నిప్పంటించారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి హాని జరగలేదు. దాబాలోని వారంతా బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. దాబా కాలిపోవడంతో ఆస్తి నష్టం మాత్రం జరిగింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక, కేసు నమోదు చేసుకుని నిందితులను విచారిస్తున్నారు.