Asianet News TeluguAsianet News Telugu

చికెన్ లేదన్నాడని దాబానే తగలబెట్టారు..

చికెన్ లేదన్నాడని ఏకంగా దాబానే తగలబెట్టేశారు ఆ ఘనులు. చికెన్ అంటే వారికున్న పిచ్చి ఆ దాబా ఓనర్ పాలిట విషాదంగా మారింది. తాగిన మత్తులో దాబాకు నిప్పంటించేశారు. ఆదివారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 

Denied chicken, 2 drunk Nagpur men set dhaba on fire  - bsb
Author
Hyderabad, First Published Jan 11, 2021, 12:24 PM IST

చికెన్ లేదన్నాడని ఏకంగా దాబానే తగలబెట్టేశారు ఆ ఘనులు. చికెన్ అంటే వారికున్న పిచ్చి ఆ దాబా ఓనర్ పాలిట విషాదంగా మారింది. తాగిన మత్తులో దాబాకు నిప్పంటించేశారు. ఆదివారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 

వివరాలు.. శంకర్ టైడే(29), సాగర్ పటేల్(19)  అనే ఇద్దరు చికెన్ ప్రేమికులు.. ఫుల్‌గా మద్యం సేవించారు. తాగుతూ, ఊగుతూ అర్దరాత్రి ఒంటిగంట టైంలో బెల్టారోడి ప్రాంతంలోని రోడ్డుపక్కన ఉన్న ఓ దాబా హోటల్‌కు వెళ్లారు. 

అక్కడ తమకు చికెన్ ఐటమ్ కావాలంటూ ఆర్డర్ చేశారు. అయితే అప్పటికే  ఆ దాబాలో చికెన్ అయిపోంది. ఇదే విషయాన్ని దాబా ఓనర్ వారికి చెప్పి, చికెన్ దొరకదని అన్నాడు. తాగిన మత్తులో ఉన్నశంకర్, సాగర్‌లు దీన్ని ఒప్పుకోలేదు. తమకు చికెన్ కావాల్సిందేనని దాబా ఓనర్‌తో వాదనకు దిగారు. 

ఈ గొడవ ముదరడంతో ఆవేశానికి లోనైన వీరిద్దరు దాబాకు నిప్పంటించారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి హాని జరగలేదు. దాబాలోని వారంతా బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. దాబా కాలిపోవడంతో ఆస్తి నష్టం మాత్రం జరిగింది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక, కేసు నమోదు చేసుకుని నిందితులను విచారిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios