ఢిల్లీలో కాల్పులు: కానిస్టేబుల్కు గాయాలు
ఢిల్లీలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో పోలీస్ కానిస్టేబుల్ గాయపడ్డాడు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో పోలీస్ కానిస్టేబుల్ గాయపడ్డాడు.
ఢిల్లీలోని భల్సావా డైరీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది.పోలీస్ చెక్పోస్టు ప్రాంతంలో బైక్ పై ముగ్గురు వ్యక్తులు వెళ్తుండగా పోలీసులు ఆపితే బైక్ పై ముగ్గురు పారిపోయారు.ఈ క్రమంలో వారిని పట్టుకొనేందుకు కానిస్టేబుల్ వెంటాడాడు.దీంతో ముగ్గురు కానిస్టేబుల్ పై కాల్పులకు దిగారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి.
వెంటనే స్థానికులు కానిస్టేబుల్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు.నిందితులు అక్కడే బైక్ ను వదిలి వెళ్లారు. ఈ బైక్ ను దొంగిలించినట్టుగా పోలీసులు గుర్తించారు. సమీపంలోని వారే ఈ బైక్ ను దొంగిలించారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.