ఎట్టకేలకు చిక్కిన టూత్పేస్ట్ దొంగ.. 23,400 టూత్పేస్టులు స్వాధీనం..
ఢిల్లీలోని లాహోరీ గేట్ ప్రాంతంలోని గోడౌన్ నుంచి 215 టూత్పేస్ట్ బాక్సులను దొంగించిన దొంగను పోలీసులు అదుపులో తీసుకున్నారు. గిడ్డంగి యజమాని కున్వర్ పాల్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి అరెస్టు చేశారు. అని నుంచి 23,400 టూత్పేస్టులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.11 లక్షలు ఉంటాయని యాజమాని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు.. మీరు వివిధ రకాల దొంగతనాల సంఘటనల గురించి వినే ఉంటారు. అయితే వారం రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన వింత దొంగతనం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సాధారణంగా ఏ దొంగనైనా.. డబ్బులు, నగలను దొచుకపోతారు. కానీ ఈ దొంగ మాత్రం టూత్పేస్ట్లను చోరీ చేశాడు. నానా తిప్పలు పెట్టించిన ఆ దొంగ చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. ఈ వింత చోరీ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. లాహోరీ గేట్లోని ఓ దుకాణంలో కనీసం 23,400 టూత్పేస్టులు, ఒక మొబైల్ ఫోన్ను దొంగిలించిన గోడౌన్ మేనేజర్ను అరెస్టు చేశారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్కు చెందిన ఉదయ్ కుమార్ అలియాస్ సంతోష్ గుర్తించారు.
వివరాల్లోకెళ్తే.. నవంబర్ 20న ఢిల్లీలోని లాహోరీ గేట్ ప్రాంతంలోని ఓ గోడౌన్ నుంచి 215 బాక్సుల టూత్పేస్ట్ మాయమైంది. దీంతో షాక్ అయినా.. గిడ్డంగి యజమాని కున్వర్ పాల్ సింగ్ ఈ నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన గోడౌన్ నుంచి 215 టూత్పేస్ట్ బాక్సులు చోరీకి గురయ్యాయని కేసు నమోదు చేశాడు. వీటి విలువ రూ.11 లక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో పరారీలో ఉన్న గోడౌన్ మేనేజర్ ఉదయ్ కుమార్ పై అనుమానం వ్యక్తం చేశాడు. గోడౌన్ నుంచి క్లోజ్అప్, డాబర్-రెడ్ కంపెనీల టూత్పేస్టులు, ఒక మొబైల్ ఫోన్ చోరీకి గురయ్యాయని పేర్కొన్నాడు.
యాజమాని ఫిర్యాదు మేరకు పోలీసు బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించింది. దాదాపు 40 CCTV ఫుటేజీలను, సమీప ప్రదేశాలు/మార్గాలను తనిఖీ చేసి విశ్లేషించారు. సీసీటీవీ కెమెరాలు, సాంకేతిక నిఘా సహాయంతో 23 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు. దొంగిలించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.విచారణలో నిందితుడు ఉదయ్ కుమార్ తప్పును ఒప్పుకున్నాడు.
అతను ఢిల్లీలోని చాందినీ చౌక్లోని స్థానిక ప్రాంతంలో కూలీగా పని చేసేవాడని . కొన్ని నెలల క్రితం తిలక్ బజార్లోని రంజన్ నివాసి ద్వారా గోడౌన్లో మేనేజర్ గా చేరానని వెల్లడించాడు. కాలక్రమేణా.. అతను తన యజమాని నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఈ క్రమంలో లక్షల విలువ చేసే..టూత్పేస్ట్లను దొంగిలించడానికి ప్లాన్ చేసాడు. ఇదిలా ఉంటే.. అతని యాజమాని.. గోడౌన్ వెలుపల చిన్న టీ-స్టాల్ నడుపుతున్న గుడ్డు అనే చాయ్వాలాకు గోడౌన్ తాళాలను ఇచ్చివెళ్లే వాడు.
ఈ విషయం తెలుసుకున్న సంతోష్. నవంబర్ 20న సాయంత్రం తన యజమాని లేకపోవడంతో.. అర్జెంట్ గా లోడ్ డెలివరీ చేయాల్సి ఉందని .. అతను గుడ్డు అనే వ్యక్తి నుండి గోడౌన్ తాళాన్ని తీసుకున్నాడు. దొంగిలించబడిన వస్తువులను రెండు రిక్షాలలో లోడ్ చేసి ఢిల్లీలోని ఐఎస్బీటీ, కశ్మీర్ గేట్ వద్దకు చేరుకుని రిక్షావాలాల సహాయంతో ఆ పేస్ట్లను ఓ ప్రైవేట్ బస్సులోకి బదిలీ చేసి తన స్వగ్రామానికి వెళ్లాడు. నిందితుడు దొంగిలించిన వస్తువులను తన ఇంటికి సమీపంలోని గదిలో ఉంచాడు. సులభంగా డబ్బు సంపాదించడానికి హోల్సేల్ లేదా రిటైల్ ధరలకు విక్రయించాలని ప్లాన్ చేశాడు. అయితే అతన్ని పోలీసు బృందం పట్టుకున్నట్లు వెల్లడించాడు.