రోటీ ఇవ్వలేదని కత్తితో పొడిచి చంపేశాడు.. ఢిల్లీలో దారుణం
తప్పతాగి వచ్చిన ఓ వ్యక్తి ఇద్దురు కలిసి తింటున్న ఆహారంపై కన్నేశాడు. రోటీ కావాలని అడగ్గా.. ఒక్ రోటీ ఇచ్చారు. కానీ, మరో రోటీ అడగ్గానే.. లేదని మున్న వారించాడు. దీంతో ఆ తాగుబోతు రోటీలు తింటున్న ఇద్దరినీ తిట్టాడు. ఆ తర్వాత కత్తితో మున్నా బాయ్ను పొడిచి చంపేశాడు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి రోటీ ఇవ్వలేదని పొడిచి చంపేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టు వెళ్లి ఓ పార్కు దగ్గర పడుకున్నాడు. సీసీటీవీ ఫుటేజీతో పోలీసులు నిందితుడిని గుర్తించారు. అనంతరం పార్క్ దగ్గరకు వెళ్లి అరెస్టు చేసిన తీసుకెళ్లారు. కరోల్ బాగ్ ఏరియాలో మొన్న రాత్రి ఈ దుర్ఘటన జరిగింది.
40 ఏళ్ల మున్నా.. మరో వ్యక్తి కలిసి ఓ ఆటో రిక్షాలో కూర్చుని ఆహారం తీసుకుంటున్నారు. వారి దగ్గరకు తప్పతాగి తూళుతూ ఉన్న ఓ వ్యక్తి వచ్చాడు. తనకు ఓ రోటీ ఇవ్వాలని కోరాడు. సరే అని.. ఆ మున్నా అనే వ్యక్తి మందుబాబుకు ఓ రోటీ ఇచ్చాడు. ఆ తాగుబోతు అంతటితో ఆగలేదు. తనకు మరో రోటీ కావాలని డిమాండ్ చేశాడు. దీనికి చిర్రెత్తుకొచ్చిన మున్నా రోటీ ఇవ్వడానికి నిర్ణయించుకోలేదు. తాను రోటీ ఇవ్వబోనని మున్నా ఆ తాగుబోతు వ్యక్తికి చెప్పాడు.
దీంతో ఆ తాగుబోతు వ్యక్తి.. ఆటో రిక్షాలో తింటున్న ఆ ఇద్దరు వ్యక్తులపై బూతులు మాట్లాడారు., అంతేకాదు, ఆ మందుబాబు కత్తిని తీసి మున్నాను పొడ్చేసినట్టు సెంట్రల్ ఢిల్లీ, డీసీపీ శ్వేత చౌహాన్ తెలిపారు.
బాధితుడు మున్నాను ఆర్ఎంఎల్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పటికే మున్నా మరణించినట్టు వైద్యులు తెలిపారు. సీసీటీవ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని 26 ఏళ్ల ఫెరోజ్ ఖాన్గా గుర్తించారు. ఆగ్రాకు చెందిన ఆ నిందితుడు ఫెరోజ్ ఖాన్ కరోల్ బాగ్ పార్క్ దగ్గర పడుకుని ఉండటాన్ని చూశారు. అనంతరం ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.