ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడింది. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను తన స్వార్థానికి ఉపయోగించుకుంటోందని ఆరోపించింది. సత్యేందర్ జైన్ హిమాచల్ ప్రదేశ్ కు ఆప్ తరుఫున ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తున్నందుకే ఆయనను తప్పుడు కేసులో ఇరికించారని తెలిపింది.
ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్ అరెస్టు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని నిందించింది. ఆయన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ పార్టీ తరఫున ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్నందుకే ఆయనను అరెస్టు చేయించిందని ఆరోపించింది. సత్యేందర్ జైన్ పై తప్పుడు కేసులు బనాయించారని తెలిపింది. కేంద్రంలోని బీజేపీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగించుకుంటోందని పేర్కొంది.
మానీలాండరింగ్ కేసులో ఢిల్లీ హెల్త్ మినిస్టర్, ఆప్ నేత సత్యేందర్ జైన్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం అరెస్టు చేసింది. దీంతో ఆప్ నేత, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్పందించారు. బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నందుకే జైన్ ను నకిలీ కేసులో అరెస్టు చేశారని అన్నారు. ఈ ఏడాది జరగనున్న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే భయంతో జైన్పై ఈడీ చర్యలు తీసుకుందని సిసోడియా ఆరోపించారు.
ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ను అరెస్ట్ చేసిన ఈడీ
“ గత ఎనిమిదేళ్లుగా సత్యేందర్ జైన్పై తప్పుడు కేసు దర్యాప్తు జరుగుతోంది. ఆయనకు ఈడీ చాలాసార్లు ఫోన్ చేసింది. అయితే ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో దర్యాప్తు సంస్థ అతడికి ఫోన్ చేయడం మానేసింది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు జైన్ ఆప్ ఇన్ఛార్జ్గా ఉన్నందున ఇప్పుడు కేసు మళ్లీ తెరిచారు.” అని సిసోడియా ట్వీట్ చేశారు. ‘‘ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలవుతోంది. హిమాచల్ను గెలవలేక జైన్ని అరెస్టు చేశారు. అతనిపై పెట్టిన కేసు పూర్తిగా అవాస్తమైనది. కాబట్టి ఆయన కొన్ని రోజుల్లో విడుదల అవుతాడు.” అని ఆయన అన్నారు.
సత్యేందర్ జైన్ అరెస్టు విషయంలో మాట్లాడేందుకు ఆప్ నాయకుడు సంజయ్ ఝా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ చర్య దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని స్పష్టంగా తెలియజేస్తుందని అన్నారు. ‘‘ సత్యేందర్ జైన్ను నకిలీ కేసులో అరెస్టు చేశారు. 8 ఏళ్ల నాటి కేసుకు సంబంధించి ఏడుసార్లు ఆయన ఈడీ ముందు హాజరయ్యారు. సీబీఐ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. జైన్ను హిమాచల్ ప్రదేశ్గా మారుస్తారని బీజేపీ గ్రహించలేకపోయింది. అందుకే ఇప్పుడు ఈ నకిలీ కేసుపై అరెస్టు చేశారు ’’ అని సంజయ్ ఝా ఆరోపించారు. కాగా ఈడీ చర్యపై బీజేపీ నేత, ఈ నెలలో పంజాబ్ పోలీసులు అరెస్టు చేసిన తజిందర్ పాల్ సింగ్ బగ్గా స్పందించారు. సత్యేందర్ జైన్ ను ‘‘స్కాంస్టర్’’ అంటూ అభివర్ణించారు.
గత నెలలో ఢిల్లీ మినిస్టర్ జైన్ కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. జైన్ ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆరోగ్యం, విద్యుత్, హోం, పిడబ్ల్యుడి, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, వరదలు, నీటిపారుదల, నీరు వంటి అనేక శాఖలను కలిగి ఉన్నారు. ఆస్తుల అటాచ్మెంట్ కోసం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసినట్లు ఫెడరల్ దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
సత్యేందర్ జైన్ అరెస్టుపై జనవరిలోనే అరవింద్ కేజ్రీవాల్ జోస్యం... ఆయన ఏమన్నాడంటే?
అటాచ్ చేసిన రూ.4.81 కోట్ల విలువైన స్థిరాస్తులు అకించన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండో మెటల్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, పర్యాస్ ఇన్ఫోసొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మంగ్లాయతన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేజే ఐడియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, వైభవ్ జైన్ భార్య స్వాతి జైన్, అజిత్ ప్రసాద్ జైన్ భార్య సుశీల జైన్, సునీల్ జైన్ భార్య ఇందు జైన్లకు చెందినవిగా ఉన్నాయి.
