గత కొంత కాలం నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు ల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 18వ తేదీన కోర్టుకు రావాలని అందులో పేర్కొంది. 

గత కొంత కాలం నుంచి అథ్లెట్లు చేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 18న విచారణకు రావాలని ఆదేశించింది. విచారణను కొనసాగించడానికి నిందితుడికి వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. అయితే బ్రిజ్ భూషణ్ సింగ్ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

భయపడే వ్యక్తి మోడీ కాలేడు - రాయ్ పూర్ విజయ్ సంకల్ప్ ర్యాలీలో ప్రధాని.. కాంగ్రెస్ పై ఫైర్

కోర్టు సమన్లపై స్పందించిన బ్రిజ్ భూషణ్.. జూలై 18న తాను కోర్టుకు హాజరవుతానని చెప్పారు. కోర్టుకు హాజరుకావడం నుంచి తనకు ఎలాంటి మినహాయింపు అవసరం లేదన్నారు. అంతకు ముందు, ఢిల్లీ పోలీసులు జూన్ 15 న సింగ్ పై లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపులు, వెంటాడే అభియోగాలతో ఛార్జిషీట్ దాఖలు చేశారు. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నెల రోజుల పాటు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Scroll to load tweet…

తమ డిమాండ్లను నెరవేర్చకపోతే తమ పతకాలను గంగానదిలో విసిరేస్తామని రెజ్లర్లు హెచ్చరించారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై లైంగిక ఆరోపణ కేసు దర్యాప్తును పూర్తి చేయడానికి జూన్ 15 డెడ్ లైన్ గా హామీ ఇచ్చిన క్రీడా మంత్రిని కలిసిన తర్వాత రెజ్లర్లు తమ నిరసనను విరమించారు.

ప్రధానిపై అసభ్య పదజాలం ఉపయోగించినంత మాత్రాన దేశద్రోహం కాదు - కర్ణాటక హైకోర్టు

కాగా.. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మైనర్ రెజ్లర్ చేసిన ఆరోపణలతో సహా తనపై వచ్చిన అన్ని ఆరోపణలను బ్రిజ్ భూషణ్ సింగ్ ఖండించారు. అన్ని ఆరోపణలను ఖండిస్తూ ధిక్కార ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే ఈ కేసులో నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ‘ఎన్డీటీవీ’ నివేదించింది.