Asianet News TeluguAsianet News Telugu

కూలిన మూడంతస్థుల భవనం..ఐదుగురు మృతి

ఈ ఘటనలో నలుగురు చిన్నారులు, ఓ మహిళ మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. 

Delhi: Building collapses in Sawan Park, 5 killed, rescue operations continue
Author
Hyderabad, First Published Sep 26, 2018, 3:18 PM IST

మూడంతస్థుల భవనం కూలి ఐదుగురు మృతి చెందిన సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని అశోక్ విహార్ ఫేజ్ సవాన్ పార్క్ ప్రాంతంలో మూడంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.


ఈ ఘటనలో నలుగురు చిన్నారులు, ఓ మహిళ మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన రెండు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టాయి. శిథిలాల కిందినుంచి ఎనిమిది మందిని రక్షించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios