Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరాఖండ్: ఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ధీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

ఢిల్లీ- డెహ్రాడూన్ శతాబ్ధీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సీ 4 బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. వెంటనే అలర్ట్ అయిన లోకో పైలట్.. రైలుని నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.

Delh Dehradun Shatabdi Express catches fire ksp
Author
Dehradun, First Published Mar 13, 2021, 3:12 PM IST

ఢిల్లీ- డెహ్రాడూన్ శతాబ్ధీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సీ 4 బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. వెంటనే అలర్ట్ అయిన లోకో పైలట్.. రైలుని నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.

ముందు జాగ్రత్త చర్యగా ప్రయాణికులను కిందకి దింపేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఉత్తరాఖండ్‌లోని కన్‌స్రో వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios