ఉత్తరాఖండ్: ఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ధీ ఎక్స్ప్రెస్లో మంటలు
ఢిల్లీ- డెహ్రాడూన్ శతాబ్ధీ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం జరిగింది. సీ 4 బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. వెంటనే అలర్ట్ అయిన లోకో పైలట్.. రైలుని నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.
ఢిల్లీ- డెహ్రాడూన్ శతాబ్ధీ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం జరిగింది. సీ 4 బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. వెంటనే అలర్ట్ అయిన లోకో పైలట్.. రైలుని నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.
ముందు జాగ్రత్త చర్యగా ప్రయాణికులను కిందకి దింపేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఉత్తరాఖండ్లోని కన్స్రో వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.