Asianet News TeluguAsianet News Telugu

తమ వర్గం అమ్మాయితో చనువుగా వుంటున్నాడని.. మాట్లాడుకుందామని పిలిచి, క్లాస్‌మేట్సే పైశాచికం

తమ వర్గం అమ్మాయితో చనువుగా వుంటున్నాడని.. మరో వర్గం యువకుడిని తోటి విద్యార్ధులే చితకబాదారు. కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 

degree student beaten by classmates in karnataka
Author
First Published Aug 31, 2022, 10:01 PM IST

ఓ వైపు భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రరాజ్యాలతో పోటీ పడే స్థాయికి చేరుకుంటుంటే మనదేశంలో నేటికీ పేద- ధనిక, అగ్రవర్ణాలు - తక్కువ కులం, మతం, మూఢనమ్మకాలు రాజ్యమేలుతూ మనుషుల మధ్య చిచ్చు పెడుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో తమ వర్గానికి చెందిన విద్యార్ధినితో మాట్లాడుతున్నాడంటూ ఓ విద్యార్ధిని తోటి విద్యార్ధులే చితకబాదారు. వివరాల్లోకి వెళితే.. సుల్యా తాలుకాలోని ఓ కాలేజీలో బాధితుడు డిగ్రీ చదువుతున్నాడు. 

ALso Read:సూర్యాపేటలో పరువు హత్య?.. వేరే కులం వ్యక్తి చెల్లిని ప్రేమిస్తున్నాడని అన్న దారుణం...

అయితే అదే విద్యాసంస్థలో చదువుకుంటున్న మరో వర్గానికి చెందిన విద్యార్ధినితో ఆ యువకుడు సన్నిహితంగా వుంటున్నాడు. దీనిని గమనించిన ఆ అమ్మాయి వర్గానికి చెందినప విద్యార్ధులు రగిలిపోయారు. మాట్లాడాలంటూ పిలిపించి కర్రలతో చితకబాదారు. తమ వర్గానికి చెందిన విద్యార్ధినితో మాట్లాడితే చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్ధి ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు యువకుడిని ఆసుపత్రిలో చేర్పించి.. ఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios