ఢిల్లీలోని ఓ రెస్టారెంట్లో సిలిండర్ పేలిపోయింది. సిలిండర్ బ్లాస్ట్ కావడంతో 13 మంది గాయపడ్డారు. ఘటన జరగ్గానే వెంటనే మూడు అగ్నిమాపక యంత్రాలు స్పాట్కు చేరాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఓ రెస్టారెంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ సిలిండర్ బ్లాస్ట్లో 13 మంది గాయపడ్డారు. రెస్టారెంట్ ముందు ఉన్న వాహనాలు పేలుడు దాటికి ధ్వంసం అయ్యాయి. ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పేలుడుతో మంటలు వ్యాపించాయి. ఈ మంటలు ఆర్పడానికి మూడు అగ్నిమాపక యంత్రాలు స్పాట్కు చేరుకున్నాయి. పోలీసు బలగాలు వెంటనే ఘటనాస్థలికి వచ్చాయి.
ఆగ్నేయ ఢిల్లీలోని జామియా నగర్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జామియా నగర్లో ఓ భవనం బేస్మెంట్లోని రెస్టారెంట్లో ఈ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు తర్వాత తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బేస్మెంట్లోని షాపులో మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. పేలుడు దాటికి రెస్టారెంట్లోని..దాని ముందు ఉన్న వారూ గాయపడ్డారు. రక్త కారుతూ కొందరు కనిపించారు. మరికొందరు మంటలతో గాయపడి తోలు ఊడి కూడా కనిపించారు. కాగా, ఆ రెస్టారెంట్ ముందే ఉన్న కొన్ని ద్విచక్ర వాహనాలు చెల్లచెదురుగా పడ్డాయి. రెస్టారెంట్ లోపలి నుంచి వచ్చిన దుమ్ము.. ధ్వంసమైన శిథిలాలు ఎదురుగా కనిపించాయి.
