Asianet News TeluguAsianet News Telugu

కారుకు నిప్పంటించుకుని ప్రేమజంట ఆత్మహత్య... ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని దారుణం..

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదని ఓ జంట దారుణానికి పాల్పడ్డారు. కారు అద్దెకు తీసుకుని పెట్రోల్ పోసి.. తాము లోపల కూర్చుని నిప్పంటించుకుని సజీవదహనమయ్యారు. 

couple dies after setting themself on fire inside car in karnataka
Author
Hyderabad, First Published May 23, 2022, 8:39 AM IST

ఉడిపి : తమ loveను ఇరు కుటుంబాలు వ్యతిరేకించడంతో తాము ప్రయాణించిన కారుపై petrol పోసుకుని నిప్పంటించుకుని యువతీ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన karnatakaలో చోటు చేసుకుంది.  ఉడిపి జిల్లా బ్రహ్వార తాలూకా హెగ్గుంజె గ్రామ సమీపంలో కారు దహనమవుతుండటాన్ని చూసిన స్థానికులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే యువతీ యువకులు అగ్నికి ఆహుతయ్యారు. బెంగుళూరుకు చెందిన యశ్వంత్, జ్యోతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

ఈ నేపథ్యంలో జ్యోతి, యశ్వంత్ శనివారం రాత్రి మంగళూరు చేరుకున్నారు. అక్కడే ఓ కారును అద్దెకు తీసుకుని ఉడిపివైపుకు పయనమయ్యారు. అంతకు ముందే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని కుటుంబపెద్దలకు తెలిపినట్లు సమాచారం. వారు అప్రమత్తం అయ్యేలోపే ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కారుపై పెట్రోల్ పోసుకుని లోపల కూర్చుని నిప్పంటించుకున్నారు. బ్రహ్మావర  పోలీసులు కేసు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, కరీంనగర్ లో ఏప్రిల్ 19న Peddapalli  జిల్లాలోని సుల్తానాబాద్  మండలంలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. sultanabad మండలంలోని కనుకులలో  Shiva అదే గ్రామానికి చెందిన యువతి సుస్మితను ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసకోవాలని కూడా భావించారు. అయితే  వీరిద్దరి కులాలు వేరు కావడంతో రెండు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. ఈ విషయమై రెండు కుటుంబాల సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసులు కూడా ఈ ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు.

అంతేకాదు ఇద్దరు కూడా మైనర్లే. ఈ రెండు కారణాలను చూపి Marriage కి పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్థాపానికి గురైన ప్రియుడు శివ సోమవారం నాడు Suicideకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకొన్న ప్రియురాలు సుస్మిత ఇవాళ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఒక్కరోజు వ్యవధిలోనే ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో రెండు కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది.

ఇదిలా ఉండగా, 2020లో సూర్యాపేటలో ఓ జంట ఇలాగే ఆత్మహత్య చేసుకుంది. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ఓ ప్రేమజంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం సూర్యాపేట జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెడితే.. చివ్వెంల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు నవీన్, ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. తమ ప్రేమ వివాహం పెద్దలకు చెప్పారు. అయితే, వీరి వివాహనికి పెద్దలు అంగీకరించలేదు. 

దీంతో మనస్తాపానికి గురైన జంట గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. మొద్దుల చెరువు గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకన్నారు. శుక్రవారం ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేమాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios