జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ యువ నేత దారుణ హత్య కలకలం రేపుతోంది. బెంగళూరు యలహంక అల్లాలసంద్రలో నివాసం ఉంటున్న అరుణ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.

జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ యువ నేత దారుణ హత్య కలకలం రేపుతోంది. బెంగళూరు యలహంక అల్లాలసంద్రలో నివాసం ఉంటున్న అరుణ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆదివారం రాత్రి సెకండ్ షో సినిమా చూడటానికి అరుణ్ తన మిత్రులతో కలిసి యశ్వంతపూర్‌కు వెళ్లారు. సినిమా చూసి అర్థరాత్రి దాటిన తర్వాత కారులో స్నేహితులతో కలిసి ఇంటికి బయలుదేరారు. ఇంటి సమీపంలోని అల్లాసంద్ర గేటు వద్ద కారు దిగుతుండగా.. అక్కడే కాపుగాచిన దుండగులు కత్తులు, మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి అరుణ్‌ని హతమార్చారు.

ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మరణించగా... ఈ దారుణాన్ని చూసిన అరుణ్ మిత్రులు పారిపోయి... కొద్దిసేపు అనంతరం అక్కడికి చేరుకుని కొనఊపిరితో ఉన్న అరుణ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

ఈ ఘటన బెంగళూరులో సంచలనం కలిగించింది.. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ సాయంతో నిందితులను గుర్తిస్తున్నారు. రాజకీయ విభేదాలతోనే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.