Asianet News TeluguAsianet News Telugu

మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు : ఎప్పటినుండో క్లారిటీ ఇచ్చిన సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై క్లారిటీ ఇచ్చారు. ఎప్పటినుండి ఈ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయనున్నారో ప్రకటించారు. 

CM Yogi Issues Alert to UP Police and Administration Ahead of Festive Season AKP
Author
First Published Oct 3, 2024, 3:51 PM IST | Last Updated Oct 3, 2024, 3:51 PM IST

లక్నో : వరుస పండుగల సందర్భంగా పోలీసు, పరిపాలనా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. గత సంవత్సరాల్లో ఇదే పండుగల సమయంలో రాష్ట్రంలో జరిగిన ప్రతి చిన్న,పెద్ద సంఘటనను అన్ని జిల్లాల యంత్రాంగం గుర్తుచేసుకోవాలని సూచించారు. నవరాత్రి మొదలు వరుసగా వచ్చే పండగల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. 

ప్రజలు ఆనందోత్సాహాలతో, శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలంటే బీట్ కానిస్టేబుల్ నుండి పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లా, రేంజ్, జోన్, సర్కిళ్ల పరిధిలోని అందరు అధికారులు అప్రమత్తంగా వుండాలని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు పండగల వేళ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేయాలని యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. 

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్‌లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పండుగ వేళ జిల్లా స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో అడిగి తెలుసుకున్నారు. లా ఆడ్ ఆర్డర్ ను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.

సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఇచ్చిన ముఖ్యమైన సూచనలు…

● అన్ని దుర్గా పూజా కమిటీలతో పోలీస్ స్టేషన్, సర్కిల్, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలి. రోడ్లను తవ్వేసి మండపాాలు ఏర్పాటు చేయకుండా చూసుకోవాలి.  అలాగే మండపాల ఏర్పాటు సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాలి. అమ్మవారి విగ్రహాల ఎత్తు పరిమితికి మించకూడదు. ఇతరుల మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వారి పరిధిలో ఎటువంటి చర్యలు తీసుకోకుండా దుర్గమ్మ మండపాలు కమిటీలతో మాట్లాడాలి.  అశ్లీల, అసభ్యకరమైన సంగీతం, నృత్యాలు ఉండకూడదు. మండపాల చుట్టుపక్కల పరిశుభ్రత పాాటించేలా కమిటీ సభ్యులకు సూచించండి. 

● విగ్రహ నిమజ్జనం చేసే మార్గం ముందుగానే స్పష్టంగా ఉండాలి. విగ్రహ నిమజ్జన మార్గంలో ఎక్కడా హైటెన్షన్ లైన్లు లేకుండా చూడాలి. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.మండపాల వద్ద అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుండా భద్రతా ఏర్పాట్లు ఉండాలి.

● బీట్ కానిస్టేబుల్ నుండి సబ్ఇ న్‌స్పెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ వరకు ప్రతి అధికారి రోడ్డెక్కాలి. పండుగ సమయంలో కొన్న అసాంఘిక శక్తులు వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించవచ్చు. అలాంటి పరిస్థితిలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. సామాన్యుడికి తన భద్రతపై పూర్తి నమ్మకం కల్పించాలి.

● శారదీయ నవరాత్రుల సమయంలో అన్ని దేవీ ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తగినంత పోలీసు బలగాలను మోహరించాలి. మీర్జాపూర్‌లోని మాతా వింద్యవాసిని ఆలయం, సహారన్‌పూర్‌లోని మాతా శాకంభరి ఆలయం, వారణాసిలోని విశాలాక్షి ఆలయం, బలరాంపూర్‌లోని మాతా పాటేశ్వరి ఆలయంలో భక్తులకు అనుకూలంగా వుండేలా, భద్రత దృష్ట్యా మెరుగైన ఏర్పాట్లు ఉండాలి. ప్రతి ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత ఉండాలి.

● పండుగల సమయంలో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తారు. గ్రామీణ మార్గాల్లో బస్సులను పెంచాల్సిన అవసరం ఉంది. పోలీసులు అయినా, బస్సు డ్రైవర్/కండక్టర్ అయినా ప్రజలతో మర్యాదగా వ్యవహరించేలా చూసుకోండి.  శిథిలమైన బస్సులను ఉపయోగించకూడదు. పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను పెంచాల్సి ఉంటుంది.

● దీపావళి పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధి పొందిన వారందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయాలి. దీనికి సంబంధించిన అన్ని  ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దీపావళికి ముందే లబ్ధిదారులందరికీ వంట గ్యాస్ సిలిండర్లు అందేలా చూసుకోవాలి.

● ఇటీవలి కాలంలో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, రాళ్లు పెడుతున్నట్లు సమాచారం అందింది. దీని వెనుక రైలు ప్రయాణానికి అంతరాయం కలిగించి ప్రమాదానికి కుట్ర పన్నినట్లు అనుమానం ఉంది. కొన్ని చోట్ల రైళ్లపై రాళ్లు విసిరిన ఘటనలు కూడా వెలుగు చూశాయి. రైల్వేతో కలిసి నిఘాను మెరుగుపరచండి. మన గ్రామ చౌకీదార్ వ్యవస్థను మరింత చురుగ్గా మార్చుకోవాలి.

● బహిరంగ ప్రదేశాల్లో మాంసం అమ్మకాలు లేదా అక్రమ జంతు వదశాలలె ఎక్కడా నడవకూడదు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి. మతపరమైన ప్రదేశాల చుట్టూ మాంసం-మద్యం దుకాణాలు ఉండకూడదు. మద్యం దుకాణాలు నిర్ణీత వేళల్లో మాత్రమే తెరవాలి. నకిలీ/విషపూరిత మద్యంపై ప్రత్యేక ప్రచారం కొనసాగించాలి.

● అన్ని ఆసుపత్రుల్లో 24×7 వైద్యులు అందుబాటులో ఉండాలి. అత్యవసర మందుల కొరత ఉండకూడదు. ఆహార పదార్థాల్లో కల్తీపై ప్రత్యేక ప్రచారం కొనసాగించాలి.

● పేదలకు, బాలింతలకు, పోషకాహార లోపం ఉన్న పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్, పౌష్టికాహారం ప్రజలకు అందేలా చూడాలి. రేషన్ మాఫియా వంటి వారిని పెరగనివ్వవద్దు. ఎక్కడైనా అలాంటి సమాచారం ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలి.

● మహిళల భద్రత, గౌరవం, స్వావలంబన కోసం అంకితం చేయబడిన 'మిషన్ శక్తి' ఐదవ దశ త్వరలో ప్రారంభం కానుంది. ప్రచారం కోసం ప్రతి శాఖ యొక్క కార్యాచరణ ప్రణాళిక ముందుగానే నిర్ణయించబడింది, దాని ప్రకారం ప్రతి శాఖ తన చర్యను నిర్ధారించుకోవాలి.

● మిషన్ శక్తి కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయంలో మహిళా బీట్ ఆఫీసర్, ఆశా, ఎఎన్ఎం, బీసీ సఖి, పంచాయతీ కార్యదర్శి తదితరులు మహిళలను సమీకరించి మహిళా సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలి.

● పేర్ల నమోదు, వారసత్వం, ఆస్తి విభజన, సర్వే వంటి సాధారణ ప్రజలకు సంబంధించిన రెవెన్యూ కేసుల పరిష్కారంలో జాప్యం జరగకూడదు. నిర్ణీత గడువులోపు వీటిని పరిష్కరించాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios