Asianet News TeluguAsianet News Telugu

"మా పిల్లలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపతున్నారు" 

ఢిల్లీతో రోజురోజుకు గాలి నాణ్యత రోజురోజుకు పడిపోతుంది. వాయు కాలుష్యం తీవ్రం కావడంతో ఆరోగ్యలు సమస్యలు తల్లెత్తున్నాయి. ఈ కాలుష్యం వల్ల వృద్ధులు,గర్భిణీ స్త్రీలు, పాఠశాలలకు వెళ్లే పిల్లలపై ఈ విష పూరిత గాలి తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో తమ పిల్లలు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని రాజధాని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Children Struggling To Breathe. Delhi Air Quality Severe Again
Author
First Published Nov 3, 2022, 2:41 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం వల్ల బతుకు భారంగా మారుతోంది. ఢిల్లీ, దాని పరిసరా ప్రాంతాల్లో కోట్లాది మంది ప్రజలు తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బందులకు గురవుతున్నారు. గురువారం ఉదయం వాయు గాలుష్యం మరింత తీవ్రమైంది. వాయు నాణ్యత సూచీ 408గా నమోదైంది. ఈ సూచీలో 401 నుంచి 500 మధ్య ఉంటే దానిని తీవ్రస్థాయిగా పరిగణిస్తారు. 

చలికాలం, రాజధాని నగరంలో వాహనాల నుంచి వచ్చే పొగ, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఆకాశంలో గాఢమైన పొగమంచు ఏర్పడింది. దీంతో కళ్ల మంటలు,గొంతునొప్పితో పాటు ఊపిరి ఆడక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ విషపూరితమైన గాలిని పీల్చితే.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు,గర్భిణీ స్త్రీలు, పాఠశాలలకు వెళ్లే పిల్లలపై ఈ విష పూరిత గాలి తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో తమ పిల్లలు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని రాజధాని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గాలి నాణ్యత క్షీణిస్తున్న దృష్ట్యా ఢిల్లీ, దాని పరిసరాల ప్రాంతాల్లోని కొన్ని ప్రవేట్ స్కూల్స్ లను మూసివేశారు. వారి విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు. మరిన్ని పాఠశాలలు ఇదే పని చేయవచ్చని వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో గాలి నాణ్యత మెరుగుపడేంత వరకు పాఠశాలలను మూసివేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కోరింది.  

మరోవైపు.. పాఠశాలలను మూసివేయడానికి బదులుగా నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని పరిష్కరించడానికి అధికారులు దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అంటున్నారు. పాఠశాలలను మూసివేయడం పరిష్కారం కాదనీ, కాలుష్యాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ఏదైనా చేయాలని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. 

రోజురోజుకు పడిపోతున్న గాలి నాణ్యత

ఢిల్లీలో మంగళవారం 424కు పడిపోయిన గాలి నాణ్యతా సూచీ.. నిన్న మెరుగై 376కు చేరింది. తాజాగా మళ్లీ 408గా నమోదైంది. 401 నుండి 500 మధ్య లో గాలి నాణ్యతా సూచీ ఉంటే.. తీవ్ర గాలి కాలుష్యంగా పరిగణిస్తారు.  నవంబర్ 1 నుంచి నవంబర్ 15 మధ్య ఢిల్లీలో గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.

గాలి నాణ్యతా సూచీ 

గాలి నాణ్యతా సూచీ (AQI) సున్నా నుంచి 50 మధ్య నమోదైతే.. "మంచిది", 51 నుంచి  100 మధ్య ఉంటే.. "సంతృప్తికరం", 101 నుంచి 200 మధ్య నమోదైతే.. "మధ్యస్థం", 201 నుంచి 300 మధ్య గాలి నాణ్యతా సూచీ ఉంటే.. "పేద", 301 నుంచి 400 మధ్య నమోదైతే.. "చాలా పేలవమైనది" గా..401 నుండి 500 మధ్య లో గాలి నాణ్యతా సూచీ ఉంటే.. తీవ్ర గాలి కాలుష్యంగా పరిగణిస్తారు.  దీనిని సూచీలో తీవ్ర లేదా అత్యంత ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు. 

పోగమంచు ఎలా ఏర్పడుతుంది?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రమాదకరమైన పొగ మరియు వాహనాలు మరియు కర్మాగారాల నుండి వచ్చే వాయువులు వాతావరణంలోని తేమతో కలిస్తే పొగ మంచు ( స్మోక్) ఏర్పడుతుంది. పొగమంచు అనేది వాస్తవానికి ఒక రకమైన వాయు కాలుష్యం. ఇది దృశ్యమానతను కూడా తగ్గిస్తుంది. ఈ పదం 20వ శతాబ్దం ప్రారంభంలో ఉనికిలోకి వచ్చింది. ఈ పదం స్మోక్, ఫాగ్ అనే ఆంగ్ల పదాల నుండి ఉద్భవించింది. వాతావరణంలో కనిపించే పొగకు పేరు పెట్టారు.

పొగమంచులో అనేక రకాల విష వాయువులు, రసాయనాలు కలిగి ఉంటుంది. ఇందులో ప్రధానంగా నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ ఆక్సైడ్లు, ఓజోన్ వాయువు, పొగ, ఇతర కణాలతో ఏర్పాడుతుంది. ఇందులో వాహనాల నుంచి వెలువడే పొగ కూడా మిళితమయ్యి.. ఉంటుంది. ఢిల్లీ వాయు కాలుష్యంలో వాహనాల నుంచి వెలువడే పొగ 50 శాతంగా ఉంది.
 
ఈ విష పూరితమైన గాలిని పీల్చుకుంటే.. అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఉబ్బసం రోగుల పరిస్థితి కొన్నిసార్లు తీవ్రంగా మారే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు పొగమంచు వాతావరణంలో బయటకు వెళ్లకుండా చూడాలి. అత్యవసర పనుల నిమిత్తం బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్‌ ధరించండి. కళ్లకు రక్షణగా అద్దాలు పెట్టుకోవాలి. ఎక్కువ నీరు తీసుకోవాలి.  

Follow Us:
Download App:
  • android
  • ios