Asianet News TeluguAsianet News Telugu

నేలబావిలో ఐదుగురు చిన్నారుల మృతదేహాలు.. వారంతా అన్నదమ్ములు

మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. సెంధ్వా పట్టణానికి సమీపంలోని చికలీలోని నేలబావిలో ఐదుగురు చిన్నారుల మృదేహాలు తేలుతూ కనిపించాయి

children dead bodies found in Ground well at madhya pradesh
Author
Madhya Pradesh, First Published Oct 10, 2018, 2:51 PM IST

మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. సెంధ్వా పట్టణానికి సమీపంలోని చికలీలోని నేలబావిలో ఐదుగురు చిన్నారుల మృదేహాలు తేలుతూ కనిపించాయి. దీంతో గ్రామంలో కలకలం రేగింది. వారంతా ఒకే తండ్రి సంతానమని.. అన్నదమ్ములని గ్రామస్తులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ఎవరైనా చంపారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఈ ఐదుగురు చిన్నారుల తండ్రి మహారాష్ట్రలో పనిచేస్తున్నాడు.. అతనికి ఇద్దరు భార్యలు.. మొదటి భార్యకు నలుగురు కొడుకులు కాగా.. రెండవ భార్యకు ఒక కొడుకు ఉన్నాడు.. అతని మొదటి భార్య పుట్టింట్లో ఉంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. దీంతో పోలీసులు ముగ్గురిని విచారిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios