Asianet News TeluguAsianet News Telugu

దేశ అత్యున్నత పదవుల్లో ఇద్దరు తెలుగువాళ్లు: జస్టిస్ ఎన్వీ రమణ, వెంకయ్య ఫోటోలు వైరల్

సుప్రీంకోర్టు నూతన సీజేగా జస్టిస్ ఎన్వీ రమణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో నెట్టింట ఓ ఫొటో వైరల్ అవుతోంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ... ఒకరికొకరు అభివాదం చేసుకుంటూ నిలుచున్న ఫొటో అది. 

chief justice of india nv ramana and vice president venkaiah naidu photo viral ksp
Author
New Delhi, First Published Apr 24, 2021, 10:11 PM IST

సుప్రీంకోర్టు నూతన సీజేగా జస్టిస్ ఎన్వీ రమణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో నెట్టింట ఓ ఫొటో వైరల్ అవుతోంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ... ఒకరికొకరు అభివాదం చేసుకుంటూ నిలుచున్న ఫొటో అది.

ప్రమాణ స్వీకారం అనంతరం.. చీఫ్ జస్టిస్‌ ఎన్వీ రమణకు ఉపరాష్ట్రపతి వెంకయ్య శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కరించారు. మర్యాదపూర్వకంగా సీజేఐ ఎన్వీ రమణ ప్రతి నమస్కారం చేశారు. ఇప్పుడీ ఫొటోను తెలుగు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఇద్దరు తెలుగువాళ్లు దేశ అత్యున్నత పదవుల్లో ఉండటం తెలుగువారందరికీ గర్వకారణం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read:సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం..

అంతకుముందు భారత 48వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. సీజేఐ ఎస్.ఎ.బొబ్డే పదవీకాలం నిన్నటితో ముగియడంతో ఇవాళ ఆయన స్థానంలో జస్టిస్ రమణ బాధ్యతలు స్వీకరించారు. 2022 ఆగస్టు 26 వరకు జస్టిస్ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవిలో వుంటారు. 

Follow Us:
Download App:
  • android
  • ios