కర్నాటకలో వివాదంగా మారిన హిజాబ్ కేసును విచారిస్తున్న న్యాయమూర్తికి వ్యతిరేకంగా ట్వీట్ చేసినందుకు అరెస్టు అయిన కన్నడ నటుడు చేతన్ కుమార్ అహింస బెయిల్ అప్పీల్ ను కోర్టు శుక్రవారానికి రిజర్వ్ చేసింది. అయితే గురువారం ఆయన పుట్టిన రోజు. దీంతో ఆయన తన 39వ పుట్టిన రోజును జైలులోనే గడపనున్నారు. 

హిజాబ్ (hijab) కేసులను విచారిస్తున్న కర్ణాటక హైకోర్టు (karnataka high court) న్యాయమూర్తికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు అరెస్ట్ అయిన క‌న్న‌డ న‌టుడు చేత‌న్ కుమార్ అహింస (chetan kumar ahimsa) త‌న 39వ పుట్టిన రోజును జైలులోనే గ‌డ‌పనున్నారు. బుధ‌వారం ఆయ‌న పిటిషన్ దాఖ‌లు చేశారు. అయితే దీనిపై కోర్టు తన నిర్ణయాన్ని శుక్రవారానికి రిజర్వ్ చేస్తుంది. అయితే ఆయ‌న‌కు గురువారం 39 ఏళ్లు నిండుతాయి. ప్ర‌స్తుతం ఆయ‌న పరప్పన అగ్రహార (Parappana Agrahara) జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. 

ఆరు రోజుల కింద‌ట చేత‌న్ కుమార్ అహింస‌.. త‌ను రెండేళ్ల కింద‌ట ట్విట‌ర్ లో పోస్ట్ చేసిన రీ ట్వీట్ (re tweet) చేస్తూ న్యాయ‌మూర్తికి వ్య‌తిరేకంగా మాట్లాడారు. అయితే ఈ కేసును పోలీసులు సుమోటోగా స్వీక‌రించి కేసు న‌మోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 505 (2) (ప్రజా దురాచారానికి దారితీసే ప్రకటనలు), 504 (శాంతి భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద అరెస్టు చేశారు.

రాయచూరు (rayachuru) లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన కోర్టు కార్యక్రమంలో మహాత్మాగాంధీ (mahatma gandi) చిత్రపటం పక్కనే డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ (dr br ambedkar) చిత్రపటం పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అప్పటి సెషన్స్‌ జడ్జి మల్లికార్జునగౌడ్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన భారీ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ ప‌రిణామం అనంతరం గౌడను కర్ణాటక స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ (Karnataka State Transport Appellate Tribunal)కు బదిలీ చేశారు. అయితే ఇది చోటు చేసుకున్న కొన్ని రోజుల వ్యవ‌ధిలోనే చేత‌న్ అరెస్ట్ జ‌రిగింది. 

అమెరికాలో పుట్టి పెరిగిన చేతన్ కుమార్ అహింస‌.. రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసీల సంక్షేమం చేసే ఉద్య‌మాల్లో ముందుటాడు. చేత‌న్ ఒక బలమైన సోషలిస్ట్. ఎండోసల్ఫాన్ (endosulfan) బాధితుల పునరావాసం కోసం (2013), కొడగు నుంచి తరిమివేయబడిన గిరిజనులకు (2016) ఇళ్ల భద్రత కల్పించడం కోసం, లింగాయత్‌లకు ప్రత్యేక మతం హోదా కోసం ఇటీవ‌ల చేసిన ఉద్య‌మాల్లో ఆయ‌న పాల్గొన్నారు. 

కన్నడ చలనచిత్ర పరిశ్రమలోని మహిళలు, రచయితలు, కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ (FIRE)తో కూడా ఆయ‌న పాల్గొన్నారు. చేతన్ తన చిరకాల స్నేహితురాలు మేఘా ఎస్ ను 2020లో ఒక అనాథాశ్రమంలో వివాహం చేసుకున్నాడు, అక్కడ ఒక లింగమార్పిడి కార్యకర్త వివాహ ప్రమాణాల మార్పిడికి ఆయ‌న అధ్యక్షత వహించారు. భారత రాజ్యాంగం కాపీలు అతిథులకు బహుమతులుగా పంపిణీ చేశారు. 

విస్మయ సినిమా షూటింగ్‌లో నటుడు అర్జున్ సర్జా తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన శృతి హరిహరన్‌కు మద్దతు ఇచ్చారు. అయితే ఈ చ‌ర్య వ‌ల్ల ఆయ‌న అర్జున్ సర్జా అభిమానుల, ఇతరుల వ్య‌క్తు ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ప్రజా ఆందోళనకు సంబంధించిన అనేక సమస్యలపై ఆయ‌న స్వరం వినిపిస్తారు. జనాదరణ లేని అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో వెనుకాడ‌బోరు. అవినీతి, మత రాజకీయాలు, ఫాసిజానికి వ్యతిరేకంగా ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటారు.