లక్ష రూపాయల కోసం అమ్మమ్మను చంపిన మనవడు
Korrukupet: లక్ష రూపాయల కోసం అమ్మమ్మను సుత్తి, బ్లేడుతో దారుణంగా హత్య చేశాడు ఓ దుండగుడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
CHENNAI: డబ్బుల కోసం సొంత అమ్మమ్మను హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చెన్నైలోని కోరుకుప్పెట్లో రూ.లక్ష కోసం అమ్మమ్మను సుత్తి, బ్లేడుతో దారుణంగా హత్య చేసిన మనవడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో పెను విషాదాన్ని నింపింది. చెన్నైలోని కోరుకుప్పెట్కు చెందిన విశాలాక్షి కారుమారియమ్మన్ నగర్లో నివాసం ఉంటున్నారు. ఆమెకు అముద అనే కుమార్తె ఉంది. ఆమె ఇంటి పని చేస్తూ జీవనం సాగిస్తుంది. పక్కనే ఉన్న గాంధీ నగర్లో అముద నివాసం ఉంటోంది. అతనికి సతీష్ అనే కుమారుడు ఉన్నాడు.
విశాలాక్షి తన కూతురు అముదకు 4 సంవత్సరాల క్రితం సెంగున్రంలో ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇచ్చింది. ఇందులో కూతురు అముద విశాలాక్షికి 3 లక్షలు తిరిగి ఇచ్చినట్లు సమాచారం. మిగిలిన లక్ష రూపాయలను తిరిగి ఇవ్వలేదు. ఈ రూ. లక్ష డబ్బు క్రమంలో ఆమె కుమారుడు సతీష్, అముద బుధవారం తల్లి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో విశాలాక్షి తన కుమార్తెకు మిగిలిన లక్ష రూపాయలు తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో తల్లీకూతుళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మాటల వాగ్వాదం జరగడంతో తల్లితో పాటు వచ్చిన సతీష్ ఆవేశానికి లోనైన అమ్మమ్మ విశాలాక్షిని ఇంట్లోని సుత్తితో కొట్టి, బ్లేడును ఉపయోగించి దాడి చేశాడు.
నిందితుడు సతీష్ దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన విశాలాక్షి.. వాళ్ల దాడిని భరించలేక కేకలు వేసింది. అప్పటికే ఆమె శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో రక్తం కారుతోంది. అమ్మమ్మ అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఆమెను రక్షించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే విశాలాక్షి మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నగర పోలీసులు మృతురాలు విశాలాక్షి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అనంతరం ఈ హత్య ఘటనపై కేసు నమోదు చేసి అమ్మమ్మను హత్య చేసిన మనవడు సతీష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రూ.లక్ష కోసం అమ్మమ్మను మనవడు హత్య చేయడం చెన్నైలోని కోరుకుప్పెట్ ప్రాంతంలో పెను విషాదాన్ని నింపింది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుండగా, దోపిడీ కేసులో 17 ఏళ్ల యువకుడిని పట్టుకునేందుకు వెళ్లిన వడపళని పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా ఇన్స్పెక్టర్పై సోమవారం పోరూర్ సమీపంలో అతని తల్లిదండ్రులు, బంధువులు దాడి చేశారు. వారు పోరూర్ సమీపంలోని పొరుగు ప్రాంతంలో ఇన్స్పెక్టర్ ముత్తులక్ష్మి వాహనం విండ్షీల్డ్ను కూడా ధ్వంసం చేశారు. పోలీసులు దోపిడీ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. అలాగే, పోలీసులపై దాడికి పాల్పడిన నిందితుడి కుటుంబ సభ్యులు.. అతని తల్లిదండ్రులు మురళి, మీనాక్షి, అతని అత్త కావేరిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.