బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి ఓ కారు దూసుకువెళ్లగా.. నలుగురు మృత్యువాతపడ్డారు. 

బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి ఓ కారు దూసుకువెళ్లగా.. నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని థానేలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పూర్తి వివరాల్లోకి వెళితే.. థానేలోని షహన్ పూర్ ప్రాంతానికి చెందిన కొందరు నాసిక్ వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో.. అటువైపుగా వస్తున్న కారు అదుపుతప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు.

మృతుల్లో 16ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. క్షతగాత్రుల్లో ఇద్దరు మైనర్ బాలికలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే పాండురంగ బరోరా.. క్షతగాత్రులను పరామర్శించారు.