Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్.. యజమానురాలిని బెదిరించి, యేడాదిగా కారు డ్రైవర్ అత్యాచారం..!

తాను పనిచేస్తున్న ఇంటి యజమానురాలిపై కన్నేశాడో కామాంధుడు. ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే భర్తను చంపేస్తానని బెదిరించాడు. 

car driver booked for raping 52-year-old woman in Gurugram
Author
First Published Oct 7, 2022, 10:47 AM IST

గురుగ్రామ్ : ఓ ఇంట్లో కారు డ్రైవర్ గా పని చేస్తున్న యువకుడు యాభై రెండేళ్ల ఇంటి యజమానురాలిపై ఏడాది కాలంగా బెదిరించి, అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగు చూసింది. గురుగ్రామ్ కు చెందిన ఓ యువకుడు తన భర్త వద్ద డ్రైవర్ గా పని చేస్తూ, ఇంటి పనుల్లో సాయం చేసేవాడిని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. 2019 డిసెంబర్ 10వ తేదీన తను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు.. తన గదిలోకి ప్రవేశించి, తనను లైంగికంగా వేధించాడని బాధిత మహిళ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది.

తాను ప్రతిఘటించడంతో నిందితుడైన డ్రైవర్ తన భర్తను చంపేస్తానని బెదిరించి, అత్యాచారం చేశాడని బాధితురాలు పేర్కొంది. నిందితుడు ఏడాదికిపైగా తనపై పదేపదే అత్యాచారం చేశాడని, దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ప్రతీసారి తన భర్తను చంపేస్తానని బెదిరించాడని మహిళ పోలీసులకు చెప్పింది. నేను చాలాకాలం మౌనంగా భరించాను. కానీ, ఇప్పుడు చివరకు పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నానని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. గురుగ్రామ్ సెక్టార్ 51 లోని మహిళా పోలీస్ స్టేషన్లు డ్రైవర్ పై ఐపీసీ సెక్షన్లు 376, 506ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. 

భార్యపై అనుమానం.. కూతురిని చంపి, బకెట్లో కుక్కి, గడ్డివాములో దాచిపెట్టిన భర్త..

ఇదిలా ఉండగా, స్నేహం ముసుగులో వివాహితపై అత్యాచారం చేసి, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ, డబ్బులు గుంజుతున్న ఓ బిజినెస్ మ్యాన్ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెడితే.. అతనో వ్యాపారవేత్త. బాగా డబ్బున్న ఓ వివాహిత తో స్నేహం చేశాడు. తరచుగా ఆమెతో కలిసి పార్టీలకు  వెళ్లేవాడు. అలాగే 6 నెలల క్రితం ఆమెను ఓ పార్టీకి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె తాగే డ్రింక్ లో మత్తు పదార్థాలు కలిపాడు. ఆ తర్వాత ఆమెను ఓ గదిలోకి తీసుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు. అంతటితో ఆగకుండా.. ఆ వీడియో చూపించి బెదిరింపులకు పాల్పడడం మొదలుపెట్టాడు. అలా ఆమె నుంచి ఏకంగా రూ.80 లక్షలు లాగేసాడు.  

అయినా, అతని ఆశ తీరలేదు. ఇంకా ఇంకా డబ్బులు కావాలని వేధింపులు ఎక్కువ చేశాడు. దీంతో అతడి ఆగడాలను భరించలేక పోయిన మహిళా ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెడితే.. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన ప్రశాంత్ కుమార్ సింగ్ లక్నోకు చెందిన ఓ వివాహితతో పరిచయం పెంచుకున్నాడు. ధనవంతుల కుటుంబానికి చెందిన ఆ మహిళతో స్నేహం చేశాడు. మంచివాడగా నమ్మించాడు. దీంతో ఆమె అతనితో కలిసి పార్టీలకు వెళ్లేది. ఆరు నెలల క్రితం ఆమెను ఓ పబ్ కి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె తాగే డ్రింక్ లో  డ్రగ్స్ కలిపాడు. మగతలో ఉన్న ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు.  

తనకు అవసరమైనప్పుడల్లా డబ్బులు అడిగి తీసుకునే వాడు.  అంతే కాదు  ఆమెను బెదిరించి పలుసార్లు అత్యాచారం చేశాడు. అలా  ఆమె నుంచి దఫదఫాలుగా రూ.80 లక్షలు కాజేశాడు.  అయినా ఆ డబ్బుతో ప్రశాంత్ సంతృప్తి చెందలేదు. జిమ్  ప్రారంభిస్తున్నానని చెప్పి మరింత డబ్బు అడిగాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios