Asianet News TeluguAsianet News Telugu

జమ్మూకాశ్మీర్‌లో విషాదం: కత్రా వద్ద యాత్రికుల బస్సులో మంటలు, నలుగురి మృతి.. భారీగా క్షతగాత్రులు

జమ్మూకాశ్మీర్‌లోని కత్రా వద్ద యాత్రికుల బస్సులో అగ్ని ప్రమాదం  చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనం కాగా. దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి ఘటనా స్థలికి చేరుకున్నారు. 

bus with pilgrims on board catches fire in jammu and kashmir
Author
Katra, First Published May 13, 2022, 5:30 PM IST

జమ్మూకాశ్మీర్‌లో (jammu and kashmir) విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం కత్రాలో (katra) యాత్రికులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో (fire accident) నలుగురు సజీవ దహనమవ్వగా.. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు కత్రా నుంచి జమ్మూకి వెళ్తుండగా కత్రాకు దాదాపు 1.5 కి.మీ దూరంలోని ఖర్ముల్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఇంజిన్‌లో మంటలు రేగి , క్షణాల్లో అది బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు  ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios