గంగానదిలో పడవ మునిగిపోవడంతో నలుగురు మరణించారు. పలువురు నీటిలో మునిగి గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు  గాలింపు చర్యలు చేపడుతున్నారు. యూపీలోని బల్లియా జిల్లాలో ఈ ఘటన జరిగింది. 

ఉత్తరప్రదేశ్ లోని బల్లియా జిల్లా మల్దేపూర్ ప్రాంతంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం గంగా నదిలో 40 మందితో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పది మందికి పైగా గల్లంతు అయ్యారు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఆహారం దొరకక ఆకలితో పులి మృతి.. కార్బెట్ నేషనల్ పార్క్ లో ఘటన

మాల్దేపూర్ ఘాట్ వద్ద పలు కుటుంబాలు గుమిగూడి తమ పిల్లలకు 'ముండన్' కార్యక్రమం నిర్వహించేందుకు ఈ పడవలో అంత మంది ప్రయాణించినట్టు తెలుస్తోంది. అయితే పడవలో ఓవర్ లోడ్ కారణంగా అది మునిగిపోయిందని అర్థమవుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు బల్లియా అధికారులు ధృవీకరించారని వారణాసి జోన్ ఏడీజీ రామ్ కుమార్ తెలిపారు.

Scroll to load tweet…

ఈ పడవ ప్రమాదంలో నీటిలో మునిగిపోయిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని జిల్లా బల్దియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.