జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ (Dhanbad) డివిజన్‌లో శనివారం తెల్లవారుజున రైల్వే ట్రాక్‌పై పేలుడు (Blast on Railway Track) సంభవించింది. ఈ కారణంగా ఆ మార్గంలో ప్రయాణించిన డీజిల్ లోకోమోటివ్ (Diesel Locomotive) పట్టాలు తప్పింది.

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ (Dhanbad) డివిజన్‌లో శనివారం తెల్లవారుజున రైల్వే ట్రాక్‌పై పేలుడు (Blast on Railway Track) సంభవించింది. దీంతో పట్టాలు కొంత భాగం దెబ్బతిన్నాయి. ఈ కారణంగా ఆ మార్గంలో ప్రయాణించిన డీజిల్ లోకోమోటివ్ (Diesel Locomotive) పట్టాలు తప్పింది. ధన్‌బాద్ డివిజన్‌లోని గర్వారోడ్, బర్కానా సెక్షన్ల మధ్య రైల్వే పట్టాలపై పేలుడు చోటుచేసుకుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. దీనిని అసాధారణ ఘటనగా రైల్వే శాఖ (Railways) పేర్కొంది. అయితే నక్సల్స్‌ ఈ పేలుడు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవతున్నాయి.  

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే సీనియర్ అధికారులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించనున్నారు. అంతేకాకుండా పేలుడు కారణంగా దెబ్బతిన్న రైలు పట్టాల పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.