ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం... రాజ్నాథ్ రాజకీయ తీర్మానం
ఢిల్లీలో ఇవాళ బీజేపీ జాతీయ కార్యవర్గం వరుసగా రెండో రోజు సమావేశమైంది. రానున్న ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై కార్యవర్గం చర్చించింది
ఢిల్లీలో ఇవాళ బీజేపీ జాతీయ కార్యవర్గం వరుసగా రెండో రోజు సమావేశమైంది. రానున్న ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై కార్యవర్గం చర్చించింది. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.. మోడీ విజన్ 2022కి అనుగుణంగా రాజ్నాథ్ తీర్మానం ఉంది. నూతన భారత్, పేదరికం లేని భారత్ను ఆవిష్కరించాలని... 2022 నాటికి అందరికి ఇళ్లు నిర్మించాలని రాజ్నాథ్ తన తీర్మానంలో పేర్కొన్నారు.