రాజస్థాన్ లో శాంతి భద్రతలు క్షీణించాయి: కాంగ్రెస్ పై బీజేపీ ఫైర్
రాజస్థాన్ లో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ ఆరోపించింది. రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలను ఆ పార్టీ ప్రస్తావించింది.
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ జైహింద్ విమర్శించారు.
రాజస్థాన్ లో జరుగుతున్న వరుస ఘటనలను ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జోధ్ పూర్ హత్యల తర్వాత తాజాగా మంత్రి బంధువు హోటల్ లో దాడులకు దిగడాన్ని జైహింద్ ప్రస్తావించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ వీడియోను కూడ ఆయన షేర్ చేశారు.
మంత్రి మేనల్లుడు గూండాలతో హోటల్ పై దాడి చేసి హింసకు పాల్పడ్డాడని ఆయన గుర్తు చేశారు. ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని జైహింద్ విమర్శించారు. మరో వైపు రాజస్థాన్ సీఎం గెహ్లాట్ నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ మాసంలో దళిత బాలిక కోచింగ్ సెంటర్ కు వెళ్లి వస్తున్న సమయంలో అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ ఘటన మర్చిపోకముందే ఇటీవలనే దళిత యువతిపై యాసిడ్ పోసి హత్య చేశారు. ఆ తర్వాత ఆమెను బావిలో వేశారు.ఈ ఘటనలపై బీజేపీ మండిపడింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయో ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయని బీజేపీ విమర్శలు చేసింది.