Asianet News TeluguAsianet News Telugu

ఆస్పత్రిలో చేరిన బిహార్ సీఎం

జ్వరం, కళ్లు, మోకాళ్ల సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Bihar CM Nitish Kumar admitted to AIIMS
Author
Hyderabad, First Published Sep 18, 2018, 2:59 PM IST

బిహార్ సీఎం నితీశ్ కుమార్ మంగళవారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్)లో  ఆయన చేరారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. రొటీన్ చెకప్‌లో భాగంగానే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు ఆ వర్గాల సమాచారం. కాగా, నితీష్ జ్వరం, కళ్లు, మోకాళ్ల సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios