Aam Aadmi Party: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్) చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే.. పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ సింగ్ ఆప్ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం భగవంత్ మాన్ సింగ్ ఆప్ ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యేలందరూ తమ తమ నియోజకవర్గాల్లోనే ఎక్కువ సమయం ఉండాలని, అంతేగానీ పార్టీ ఆఫీసులో గానీ, రాజధానిలో మకాం వేయవద్దని హుకూం జారీ చేశారు.
Aam Aadmi Party: ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఐదు రాష్టాల ఎన్నికలు(Elections) ముగిశాయి. అందరూ ఊహించినట్టే.. ఫలిలాలు వచ్చేశాయి. కానీ, పంజాబ్ లో ఫలితాలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరచడం మాత్రమే కాదు ఆలోచనలో కూడా పడవేసిందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో కేవలం 18 సీట్లు సాధించిన పార్టీ .. ఈ సారి Punjab Assembly Election 2022 ఎన్నికల్లో ఆప్ తన సత్తా చాటింది. అధికారంలో ఉన్న Congress ను మట్టికరిపించింది. గెలుపుతో పాటు 60 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది AAP. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన రెండో ప్రయత్నంలో 92 స్థానాలను సాధించి.. ఆప్ అధికారం చేజిక్కించుకోవడం విశేషం. ఇక్కడ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లు సాధించగా.. ఇప్పుడు కేవలం 18 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.
ఇదిలా ఉంటే.. పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ సింగ్ ఆప్ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం అతని నేతృత్వంలో తొలిసారి ఆప్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలందరూ భగవంత్ మాన్ను శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ భగవంత్ మాన్ శనివారం గవర్నర్తో భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా భగవంత్ మాన్ మాట్లాడుతూ ఆప్ ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ‘ఎమ్మెల్యే లందరూ రాజధాని చండీగఢ్లో కాకుండా.. తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని, ఎక్కువ సమయంలో నియోజకవర్గాల్లోనే గడపాలని సూచించారు. అంతేగానీ పార్టీ ఆఫీసులోనే వుండొద్దని, రాజధానిలోనే మకాం వేయవద్దని హుకూం జారీ చేశారు.
అలాగే.. క్యాబినెట్ బెర్త్ల కోసం ఆరాటపడవద్దు అని భగవంత్ అన్నారు. తమ తమ నియోజకవర్గాల్లో పనిచేయాలనీ.. తమపై నమ్మకం ఉంచిన వారి కోసం పనిచేయాలనీ, నియోజకవర్గాల్లోనే నిత్యం ఉండాలనీ, కేవలం చండీగఢ్లోనే ఉండొద్దనీ భగవంత్ మాన్ ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీకి ఓటు వేయని వారి కోసం కూడా పని చేయాలని, అహంకారంతో ఉండవద్దని విజ్ఞప్తి చేశారు.
మీరు పంజాబీల ఎమ్మెల్యేలు. వారు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం 17 మంది మంత్రులతో ఉన్న కేబినెట్ వుందని, ఎవ్వరూ నిరాశ చెందవద్దని విజ్ఞప్తి చేశారు. అందరూ కేబినెట్ మంత్రులేనంటూ భగవంత్ మాన్ ఎమ్మెల్యేలతో అన్నారు. 117 మంది సభ్యుల అసెంబ్లీలో ఆప్ 92 స్థానాలను కైవసం చేసుకుని ఎన్నికలలో భారీ విజయాన్ని సాధించింది. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి అభ్యర్థి భగవంత్ మాన్ సింగ్ ధురి స్థానం నుండి 58,000 ఓట్ల తేడాతో గెలుపొందారు.
అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన తరువాత.. శుక్రవారం ఉదయం.. భగవంత్ మాన్ సింగ్ ఢిల్లీలో పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను సందర్శించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. మార్చి 16న జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా ఆహ్వానించారు. పంజాబ్ ఎన్నికల్లో .. ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్తో సహా అన్ని పార్టీలకు చెందిన దిగ్గజాలు ఓటమి పాలయ్యారు.