Asianet News TeluguAsianet News Telugu

వింత ఘటన.. మధ్యప్రదేశ్‌లో 'నాలుగు' కాళ్లతో జన్మించిన చిన్నారి..

మధ్యప్రదేశ్ లో ఓ చిన్నారి నాలుగు కాళ్లతో జన్మించింది. నడుము కింది భాగం నుంచి అతుక్కుని ఈ కాళ్లు ఉన్నాయి. చిన్నారిని ఆపరేషన్ చేయడం ద్వారా ఆ అదనపు కాళ్లను తొలగించవచ్చేమోనని వైద్యులు పరీక్షిస్తున్నారు. 

Baby Girl Born With 'Four' Legs In Madhya Pradesh
Author
First Published Dec 16, 2022, 11:34 AM IST

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఓ మహిళ నాలుగు కాళ్లతో ఉన్న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వింత స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. సికందర్ కాంపూ ప్రాంతానికి చెందిన ఆర్తి కుష్వాహా బుధవారం ఇక్కడి కమల రాజా ఆసుపత్రిలోని మహిళా శిశు వైద్య విభాగంలో పాపకు జన్మనిచ్చింది. నవజాత శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఆడ శిశువు బరువు 2.3 కిలోలు. ప్రసవం తర్వాత, గ్వాలియర్‌లోని జయరోగ్య హాస్పిటల్ గ్రూప్ సూపరింటెండెంట్‌తో పాటు వైద్యుల బృందం శిశువును పరీక్షించింది. జయరోగ్య హాస్పిటల్ గ్రూప్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్కేఎస్ ధాకడ్ మాట్లాడుతూ, "పుట్టుకతోనే శిశువుకు నాలుగు కాళ్లు ఉన్నాయి, ఆమెకు శారీరక వైకల్యం ఉంది. పిండం రెండుగా విడిపోయినప్పుడు ట్విన్స్ గా మారతాయి. అయితే కొన్నిసార్లు ఇలా ఒకటే పిండానికి అదనపు శరీర భాగాలు పెరుగుతాయి. దీనిని వైద్య శాస్త్ర భాషలో ఇస్కియోపాగస్ అంటారు. ఈ ఆడ శిశువు నడుము కింది భాగంలో అదనంగా రెండు కాళ్ళు అభివృద్ధి చెందాయి. కానీ ఆ కాళ్లు క్రియారహితంగా ఉన్నాయని తెలిపారు.

అస్సాంలో దారుణం.. ఏనుగుల దాడిలో చిన్నారితో పాటు మరో ఇద్దరు మృతి..

‘‘ప్రస్తుతం పీడియాట్రిక్ డిపార్ట్‌మెంట్ వైద్యులు చిన్నారిని పరీక్షిస్తున్నారు. ఆ శిశువు శరీరంలో ఇంకా ఏదైనా ఇతర వైకల్యం ఉందా అని తనిఖీ చేస్తున్నారు. పరీక్షల తర్వాత, ఆమె ఆరోగ్యంగా ఉంటే, శస్త్రచికిత్స ద్వారా ఆ కాళ్ళను తొలగిస్తారు. తద్వారా ఆమె సాధారణ జీవితం గడపవచ్చు" అని డాక్టర్ ధాకడ్ చెప్పారు.

సూపరింటెండెంట్ మాట్లాడుతూ, “ఆడపిల్ల ప్రస్తుతం కమల రాజా హాస్పిటల్‌లోని పీడియాట్రిక్స్ డిపార్ట్‌మెంట్‌లోని స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్‌లో ఉంది. శిశువు ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. శస్త్రచికిత్స ద్వారా ఆమె అదనపు కాళ్ళను తొలగించాలని వైద్యులు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం చిన్నారి పూర్తిగా ఆరోగ్యంగా ఉంది.

కాగా, ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో ఓ మహిళ రెండు తలలు, మూడు చేతులు, రెండు కాళ్లతో ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి చికిత్స అందించిన డాక్టర్ బ్రజేష్ లాహోటి మాట్లాడుతూ, "ఈ దంపతులకు ఇది మొదటి సంతానం, ఇంతకుముందు సోనోగ్రఫీ నివేదికలో ఇద్దరు పిల్లలు ఉన్నారని తేలింది. ఇది అరుదైన కేసు, అయితే ఇలా పుట్టిన పిల్లలు ఎక్కువ కాలం జీవించరు’ అని చెప్పారు.  

"పిల్లల బరువు సుమారు 3 కిలోలు, రెండు వెన్నుపూసలు, ఒకే కడుపు ఉంది. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఈ పిల్లవాడికి ఉన్నదాన్ని డైసెఫాలిక్ పారాపాగస్ అంటారు" అని చెప్పుకొచ్చారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios