బాబాకా దాబా యజమాని ఆత్మహత్యాయత్నం: సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స
బాబాకా దాబా యజమాని కాంత ప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశాడు.దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆత్మహాత్యాయత్నం చేసిన కాంత ప్రసాద్ ను గుర్తించిన కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.
న్యూఢిల్లీ: బాబాకా దాబా యజమాని కాంత ప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశాడు.దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆత్మహాత్యాయత్నం చేసిన కాంత ప్రసాద్ ను గుర్తించిన కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో కాంత ప్రసాద్ రెస్టారెంట్ ను ప్రారంభించాడు. ఈ రెస్టారెంట్ నష్టాల్లో ఉంది. దీంతో ఆయన తిరిగి గతంలో తాన నడిపిన రోడ్డు సైడ్ పాత హోటల్ ను నడుపుకొంటున్నాడు.
కరోనా కారణంగా ఆదాయం లేక ఇబ్బందిపడుతున్న విషయాన్ని బాబాకా దాబా నడుపుతున్న కాంతప్రసాద్ దంపతుల వ్యధను ఓ యూట్యూబర్ వెలుగులోకి తెచ్చాడు. ఈ విషయమై పలువురు కాంత ప్రసాద్ దంపతులకు సహాయం చేశారు. దీంతో రూ. 5 లక్షలతో అద్దె స్థలంలో రెస్టారెంట్ ప్రారంభించారు.
ఆరు మాసాల పాటు రెస్టారెంట్ నడిపినా అది సక్రమంగా నడవలేదు. దీంతో కాంత ప్రసాద్ తిరిగి పాత హోటల్ నడుతుపుకొంటున్నాడు. ఈ విషయమై మనోవేదనకు గురైన కాంత ప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశాడని కుటుంబసభ్యులు చెప్పారు. సఫ్డర్జంగ్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. కాంత ప్రసాద్ తనయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.