Asaduddin Owaisi: హర్యానాలోని నుహ్లోని విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) ఊరేగింపును పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయంపై ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బీజేపీపై విరుచుకుపడ్డారు.
Asaduddin Owaisi: హర్యానాలోని నుహ్లో వాతావరణం మరోసారి వేడెక్కింది. విశ్వహిందూ పరిషత్ (VHP) నూహ్లో బ్రజ్ మండల్ యాత్రను చేపట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో పోలీసులు నగరాన్ని అప్రమత్తం చేస్తున్నారు. పలువురికి హెచ్చరికలు చేస్తున్నారు. యాత్ర చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనప్పటికీ.. జూలై 31న విరమించిన యాత్రను చేపట్టేందుకు వీహెచ్పీ మొండిగా వ్యవహరిస్తోంది. వీహెచ్పీ ప్రకటన దృష్ట్యా నుహ్లో 144 సెక్షన్ విధించారు. జిల్లాలో 30 మంది పారా మిలటరీ ఫోర్స్ను మోహరించారు.
'ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా వీహెచ్పీ బెదిరింపులు'
మరోవైపు.. విశ్వహిందూ పరిషత్ (VHP) తన శోభాయాత్రను ప్రారంభిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హర్యానా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘హర్యానాలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా శోభాయాత్ర చేపడతామని వీహెచ్పీ బెదిరింపులకు పాల్పడుతోంది.
ఈ యాత్ర ముసుగులో ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటారని.. నుహ్ హింసకు ముందే ప్రభుత్వానికి తెలుసు.. ఒక వేళ ముస్లింలపై ఏకపక్షంగా చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే.. అసలు దోషిని నెత్తినెక్కించుకోకుండా ఉండి ఉంటే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్ర నిర్వహించాలన్న సైన్యానికి ఇంత ధైర్యం ఉండేది కాదు. ఇవి బీజేపీ పావులు కాదని, ఈ సంఘటిత నేరస్తుల ముందు బీజేపీ నిస్సహాయంగా ఉందని తెలుస్తోంది. నూహ్లో మళ్లీ హింస చోటుచేసుకుంటే హర్యానా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇప్పుడు కూల్చడానికి కూడా ముస్లిం ఇళ్లు లేవు' ఒవైసీ తన ట్వీట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత నెలలో హర్యానాలోని నూహ్ ప్రాంతంలో ఘర్షణలు చెలారేగాయో అందరికీ తెలిసిందే. సోమవారం వీహెచ్పీ మరోసారి శోభాయాత్ర చేపడతామని పిలుపునిచ్చిన నేపథ్యంలో నూహ్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో.. నల్హర్ మహాదేవ్ ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల ప్రాంతంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్ దాటి వెళ్లేందుకు వాహనాన్ని అనుమతించరు. ITBP నల్హార్ ఆలయానికి అతి సమీపంలో పరంజాను ఏర్పాటు చేసింది. అక్కడ సాయుధ జవాన్లు అలర్ట్ మోడ్లో మోహరించారు. డ్రోన్ల సాయంతో పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నుహ్కు ఆనుకుని ఉన్న రాజస్థాన్ సరిహద్దును కూడా మూసివేశారు.
