Asianet News TeluguAsianet News Telugu

ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా.. ఆ చిన్నారుల లైవ్ ‘మ్యాచ్‌’లో ట్విస్ట్ అదుర్స్

వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా చేసే ట్వీట్లు అబ్బురపరుస్తుంటాయి. ఆయన చేసే ట్వీట్లు సరికొత్తగా ఉండటమే కాక, మెజార్టీ ప్రజలకు చేరువయ్యే అంశాలను ప్రస్తావిస్తుంటారు. తాజాగా ఆయన ట్వీట్ చేసిన ఓ వీడియోపై ఫాలోయర్లు ప్రశంసలు కురిపించారు.
 

anand mahindras live kids match video has a surprising twitst
Author
New Delhi, First Published Sep 13, 2021, 5:01 PM IST

న్యూఢిల్లీ: బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా ప్రపంచంలో ఏదో ఒక మూలన జరిగిన అద్భుతాన్ని ట్వీట్ చేసి తన ఫాలోయర్లకు ఆనందోత్సహాలను పంచుతుంటారు. ఆయన ట్వీట్లు చాలా ఆదరణ పొందుతుంటాయి. తాజాగా, ఇదే కోవకు చెందిన ఓ ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిన్నారుల ‘లైవ్’ మ్యాచ్ వీడియో, అందులోని ట్విస్ట్‌ను పంచుకున్నారు. ట్విస్ట్‌ను కీర్తించడమే కాదు, మహమ్మారి కంటే ముందటి కాలాన్ని గుర్తుచేసుకున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏమున్నదంటే..

ఈ వీడియోలో ఏదో కొందరు పిల్లలు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు కదా అనుకుంటే పొరబడ్డట్టే. ఇందులో అదిరిపోయే ట్విస్ట్ ఉన్నది. కొంత మంది చిన్నారులు ఓ మ్యాచ్ లైవ్ చూస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. పిల్లలు మ్యాచ్ ఆడుతుంటారు. అందులో బ్యాట్‌మెన్ బంతిని బాదడంతో చాలా దూరం పడుతుంది. ఓ ఫీల్డర్ గ్రౌండ్ నుంచి స్క్రీన్ వైపు పరుగెత్తుకొస్తుంటాడు. ఆ స్క్రీన్‌లో నుంచి చేయి పెట్టి బంతి ఇవ్వాల్సిందిగా ఓ ప్రేక్షకుడిని అడగడంతో ట్విస్ట్ బయటపడుతుంది. అదంతా ప్రత్యక్షంగా అక్కడ జరుగుతున్న మ్యాచేనని, కేవలం ఓ టీవీ ఫ్రేమ్ అమర్చడంతో లైవ్ మ్యాచ్ చూస్తున్నట్టు అనుభూతి కలిగిందని అర్థమవుతుంది.

 

ఈ వీడియోను ట్వీట్‌కు జతచేస్తూ ఆనంద్ మహీంద్ర తన గతస్మృతులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఇది పాత వీడియోనే అని పేర్కొన్న ఆయన ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రతి చర్యకు ముందు స్క్రీన్ పెడుతున్నారని వివరించారు. ఆ స్క్రీన్ గుండా అవతలికి వెల్లి అప్పటి ‘నిజమైన’ విషయాలను మరోసారి అనుభవించగలిగారని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios