Asianet News TeluguAsianet News Telugu

జ్ఞానవాపి పిటిషనర్ల మధ్య విభేదాలు? కారుణ్య మరణానికి అనుమతివ్వాలని రాష్ట్రపతికి పిటిషనర్ లేఖ.. జూన్ 9 డెడ్ లైన్

జ్ఞానవాపి కేసులో పిటిషనర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మిగిలిన నలుగురు పిటిషనర్లు తనను తీవ్రంగా వేధిస్తున్నారని, కాబట్టి, కారుణ్య మరణానికి అనుమతించాలని ఈ కేసు నుంచి విత్ డ్రా చేసుకున్న పిటిషనర్ రాఖి సింగ్ తెలిపారు. జూన్ 9వ తేదీలోగా తనకు సమాధానం ఇవ్వాలని డెడ్ లైన్ పెడుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు.
 

allow me to euthanasia gyanvapi case petitioners letter to president droupadi murmu kms
Author
First Published Jun 8, 2023, 4:39 PM IST

న్యూఢిల్లీ: వారణాసిలో జ్ఞానవాపి కేసు దేశవ్యాప్తంగా చర్చను లేపిన సంగతి తెలిసింది. ఆ మసీదు కాంప్లెక్స్‌లో హిందూ దైవం ఉన్నదని, అక్కడ పూజలు చేయడానికి అనుమతించాలని ఐదుగురు హిందువులు పిటిషన్ వేశారు. ఇప్పుడు ఈ పిటిషనర్ల మధ్య ఇప్పుడు విభేదాలు రచ్చకెక్కాయి. ఆ విభేదాలు కూడా దేశవ్యాప్తంగా చర్చను రేపేలా ఉన్నాయి.

వారణాసి జ్ఞానవాపి కేసు నుంచి వెనక్కి వెళ్లిన పిటిషనర్ రాఖీ సింగ్ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ లేఖ రాశారు. కారుణ్య మరణానికి అనుమతించాలని అందులో కోరారు. జ్ఞానవాపి కేసులో మిగిలిన నలుగురు పిటిషనర్లు తనను వేధిస్తున్నారని ఆరోపించారు.

ఆ నలుగురు పిటిషనర్లు తనను వేధిస్తున్నారని వివరిస్తూ రాఖి సింగ్ రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ లేఖకు సమాధానం జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల్లోపు తనకు రావాలని డెడ్ లైన్ విధించారు. 

‘మీ సమాధానం కోసం 2013 జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల వరకు వేచి చూస్తూ ఉంటాను. మీ నుంచి నాకు ఎలాంటి స్పందన రాకపోతే.. ఆ తర్వాత తీసుకునే నిర్ణయానికి పూర్తిగా నాదే బాధ్యత’ అని రాఖి సింగ్ హిందీ భాషలో రాసిన లేఖలో పేర్కొన్నారు.

Also Read: బీజేపీకి మద్దతుగా లేని పార్టీ ఒక్కటైనా దేశంలో ఉన్నదా?: విపక్ష ఐక్యకూటమిపై దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు

నలుగురు పిటిషనర్లు తనను అపఖ్యాతి పాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని, తనను, తన కుటుంబానికి అప్రతిష్ట అంటగడుతున్నారని ఆరోపించారు. 2022 మే నెలలో ఈ పిటిషనర్లు తనకు వ్యతిరేకంగా వారి దుష్ప్రచారంలో భాగంగా తప్పుడు వదంతులు వ్యాప్తి చేశారని పేర్కొన్నారు. తాను, తన అంకుల్ జితేండ్ర సింగ్ విసెన్ ఈ కేసులో నుంచి ఉపసంహరణ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకముందే ఈ పిటిషనర్లు ముందుగానే తాము ఉపసంహరించుకున్నట్టు ప్రచారం చేశారని తెలిపారు. 

ఈ గందరగోళంతోనే మొత్తం హిందూ సమాజమే తనకు, తన కుటుంబానికి వ్యతిరేకంగా మారారని ఆమె తెలిపారు. ప్రభుత్వం నుంచి పాలక వర్గం నుంచి చాలా మంది ఈ దుష్ప్రచారంలో పాలుపంచుకుంటున్నారని వివరించారు. ఈ విషయమై తాను తీవ్ర కలత చెందానని పేర్కొన్నారు. కాబట్టి.. ఈ బాధకు అంతిమ గీతం పాడటానికి కారుణ్య మరణానికి తనకు అనుమతించాలని ఆమె కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios