Asianet News TeluguAsianet News Telugu

ఊరట: చిదంబరాన్ని జూలై 10 వరకు అరెస్ట్ చేయొద్దు: కోర్టు

చిదంబరానికి ఉపశమనం

Aircel-Maxis case: P Chidambaram gets   relief from ED arrest until July 10

న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర ఆర్ధికశాక మంత్రి పి. చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో జూలై 10వ తేది వరకు అరెస్ట్ చేయవద్దని న్యూఢిల్లీ కోర్టు ఈడీని ఆదేశించింది.


మంగళవారం నాడు ఉదయమే న్యూఢిల్లీ  కోర్టు ఈ మేరకు ఈడీని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని కోర్టు ఈడీని ఆదేశించింది.జూలై 10వ తేది నాటికి  ఈ సమాచారాన్ని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అంతేకాదు అదే రోజున తదుపరి విచారణను చేయనున్నట్టు కోర్టు ప్రకటించింది.

ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం  ఢిల్లీ కోర్టును ఆశ్రయించడంతో చిదంబరానికి కోర్టు నుండి ఉపశమనంలభించింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios