ఎండకు తట్టుకోలేక.. కాస్ట్లీ కారుకి ఆవు పేడ అలికి..!!
భానుడి భగభగలతో దేశం మొత్తం అల్లాడుతోంది. ఏ మూల చూసినా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే జనం వణికిపోతున్నారు. దీంతో ఎవరికి తోచిన విధంగా వారు చల్లదనాన్ని వెతుక్కుంటున్నారు.
భానుడి భగభగలతో దేశం మొత్తం అల్లాడుతోంది. ఏ మూల చూసినా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే జనం వణికిపోతున్నారు. దీంతో ఎవరికి తోచిన విధంగా వారు చల్లదనాన్ని వెతుక్కుంటున్నారు.
ఈ క్రమంలో ఓ మహిళా ఏకంగా కారుకి పేడ పూత పూసింది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్కు చెందిన ఓ మహిళ తన ఖరీదైన కారు మొత్తానికి ఆవు పేడ పూసింది. అద్దాలు, లైట్లు, కంపెనీ లోగో మినహా మిగిలిన భాగం మొత్తం ఆవు పేడ అలికింది.
దీనికి సంబంధించిన ఫోటోలను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, నగరంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరిన నేపథ్యంలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు సదరు మహిళ ఈ పని చేసినట్లు ఆ వ్యక్తి తన ఫేస్బుక్ పేజీలో తెలిపాడు. ఈ కారు యజమాని పేరు సేజల్ షా అని పేర్కొన్నాడు.
అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు నచ్చినట్లుగా కామెంట్లు పెడుతున్నారు. ఈమె ఆవు పేడను సరైన పద్ధతిలో ఉపయోగించారని, తెలివైన వారని కొందరు అంటుంటే, మరికొంతమంది మాత్రం వెక్కిరిస్తున్నారు.