ఇప్పుడు దేశాన్ని ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. దేశంలో కేసులు నమోదవుతున్న పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ  కేసులు నమోదవుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా రోజుకో కొత్త వ్యాధి పుట్టుకొస్తోంది. మొన్నటి వరకూ కరోనా, నిన్నటి బర్డ్ ప్లూ లాంటి వైరస్ లు.. ఇలా రోజుకో కొత్త వ్యాధి ప్రపంచాన్ని కలవరం పెడుతున్నాయి. నేడు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనే మరో కొత్త వైరస్ వణికిస్తోంది. కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం రేపింది.

కన్నూర్ జిల్లాలోని కనిచర్ పంచాయతీలోని ఓ ప్రైవేట్ పందుల ఫారంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వ్యాపించింది. దీంతో ఆ ఫారంలో 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పందులన్నింటినీ చంపాలని కన్నూర్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వెటర్నరీ అధికారుల తనిఖీ తర్వాత కన్నూర్‌లోని ఒక కమోడిటీ ఫామ్‌లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నివేదించబడింది.

జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర పొలాల పందులను కూడా చంపుతారు. ప్రోటోకాల్ ప్రకారం మృతదేహాన్ని పారవేస్తారు. ఆ ఫారం చుట్టూ 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని వ్యాధి నిఘా జోన్‌గా ప్రకటించారు. దీనితో పాటు.. ప్రభావిత ప్రాంతంలోని ఫామ్ ల నుండి పంది మాంసం అమ్మకం, పందుల రవాణాను మూడు నెలల పాటు నిషేధించారు. వ్యాధి మరింత ప్రబలకుండా పశువైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.