Asianet News TeluguAsianet News Telugu

బస్సును ఢీ కొట్టిన విమానం రెక్క..ధ్వంసమైన బస్సు.. గంటలపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం    

కేరళ రాజధాని తిరువనంతపురంలో ట్రక్కులో ప్రయాణిస్తున్న విమానం రెక్క రాష్ట్ర రవాణా బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బుధవారం బలరామపురంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని గంటలపాటు జాతీయ రహదారిని మూసివేశారు.

Aeroplane wing transported in trailer crashes into KSRTC bus several injured
Author
First Published Nov 3, 2022, 11:44 AM IST

కేరళ రాజధాని తిరువనంతపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన  బస్సుకు ట్రక్కులో ప్రయాణిస్తున్న విమానం రెక్క బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదం బుధవారం బలరామపురంలో జరిగింది. నేషనల్ హైవే ఈ ప్రమాదం జరగడంతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. 

వివరాల్లోకెళ్తే.. పాత ఎయిర్‌బస్ A320 రెక్కలు, ఇతర భాగాలను తిరువనంతపురం నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళుతున్నారు. ఈ విమానం 30 ఏళ్ల పాటు విమానయాన సర్వీసులో పనిచేసింది. 2018లో ఈ  విమానాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలోని హ్యాంగర్ యూనిట్‌లో ఉంచారు. గత నాలుగు సంవత్సరాలుగా.. ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ విమానాన్ని అధ్యయనం కోసం ఉపయోగిస్తున్నారు. మారుతున్న సాంకేతిక నేపథ్యంలో 
విమానం అధ్యయనానికి పనికిరాకపోవడంతో, అధికారులు దానిని స్క్రాప్‌కు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. 

ఈ మేరకు వేలం వేశారు. ఆ వేలంలో హైదరాబాద్ కు చెందిన జోగిందర్ సింగ్ రూ. 75 లక్షలకు విమానాన్ని కొనుగోలు చేశారు. ఈ విమానాన్ని అనేక భాగాలుగా విడదీసి నాలుగు ట్రైలర్లలో హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది. ప్రమాద అనంతరం ట్రైలర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. ట్రైలర్‌ను తొలగించడంలో పోలీసులు విఫలయత్నం చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో ట్రైలర్‌ డ్రైవర్‌ వచ్చి ట్రైలర్‌ను తొలగించాడు. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios