ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నవపడ జిల్లా సిల్లా వద్ద జీపును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులంతా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం మహాసముంద వాసులుగా గుర్తించారు. 

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక కుటుంబం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోమ్నాలోని వైష్ణోదేవి మందిరానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. వీరు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం ప్రమాదానికి గురైంది..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నువాపడా-కరీయార్ జాతీయ రహదారిపై సిల్దా గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న లారీ.. బోలెరోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా మొత్తం 10 మంది దుర్మరణం పాలయ్యారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌లోని మహసముంద్ జిల్లా కకరా ప్రాంతానికి చెందిన వారు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.