ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఇవాళ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో బుధవారం నాడు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుండి న్యూఢిల్లీని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై ఈడీ అధికారులు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో సోదాలు చేస్తున్నారు. రెండు మూడు రోజుల క్రితం ఆప్ ఎంపీకి అత్యంత సన్నిహితులుగా ఉన్న వారి ఇళ్లలో కూడ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్ లో సంజయ్ సింగ్ పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈడీ అధికారులు తమ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తండ్రి మీడియాకు చెప్పారు. ఈడీ సోదాలకు సహకరిస్తున్నామన్నారు. సంజయ్ సింగ్ కు క్లియరెన్స్ కోసం వేచి చేస్తున్నట్టుగా తెలిపారు.
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ అధికారుల సోదాలపై శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. బీజేపీకి ఈడీ, ఐటీ, సీబీఐలు అత్యంత విశ్వసనీయమైన మిత్రపక్షాలుగా ఆరోపించారు.గతంలో ఏం దొరకలేదు.. నిన్న కొందరు జర్నలిస్టుల నివాసాల్లో కూడ దాడులు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త దినేష్ ఆరోరా గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆయన నివాసంలో సంజయ్ సింగ్ సమక్షంలో కలిశారు. సంజయ్ సింగ్ ను దినేష్ ఆరోరా ఒక కార్యక్రమంలో సంజయ్ సింగ్ ను కలిశారని, ఆ తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో టచ్ లో ఉన్నట్టుగా ఈడీ ఆరోపించింది.