Asianet News TeluguAsianet News Telugu

వెంబ‌డించి.. నడిరోడ్డుపై అంద‌రూ చూస్తుండ‌గానే.. కత్తులతో పొడిచి యువకుడి దారుణ హత్య.. కార‌ణ‌మ‌దేనా..? 

కర్ణాటకలోని కలబురగిలో ఓ యువకుడి వెంబ‌డించి హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మృతుడు నిందితుల నుంచి అప్పుగా డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వడంలో జాప్యం చేస్తున్నాడు. ఈ హత్య ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

A youth was killed due to a money dispute, the incident was caught on CCTV in Karnataka
Author
First Published Sep 20, 2022, 4:34 AM IST

అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి  చెల్లించలేదన్న కారణంతో  ఓ యువకుడిని అంద‌రూ చూస్తుండ‌గానే..  వెంబ‌డించి అత్యంత దారుణంగా హ‌త‌మార్చారు. ఈ భ‌యాన‌క ఘటన కర్ణాటకలోని కలబురగిలో చోటుచేసుకుంది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది . హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు . సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. అనే కోణంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కల్బుర్గికి చెందిన జమీర్ అనే యువకుడు పరిచయం ఉన్న సమీర్ అనే వ్యక్తి వద్ద రూ.9 వేలను అప్పుగా తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత సమీర్ అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి అడిగాడు. అయితే జమీర్ మాత్రం డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్ర‌మంలో శనివారం జమీర్‌ జేవర్గి రోడ్డు మీదుగా వెళ్తున్నాడు. ఇంతలో సమీర్ తన స్నేహితుడు ఆకాష్‌తో కలిసి జమీర్‌ను వెంబ‌డించారు. అదును చూసి..  సమీర్ పదునైన ఆయుధంతో దాడి చేయడంతో వెంటనే జమీర్ పరుగు ప్రారంభించాడు. అయితే సమీర్‌, ఆకాష్‌లు అతన్ని పరుగెత్తుకుంటూ పట్టుకుని నేలపై పడేసి కత్తితో పొడిచారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన జమీర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

హత్యానంతరం పరారీలో ఉన్న నిందితులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా సోదాలు ప్రారంభించారు. హత్య అనంతరం నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారీ అయ్యారు. ఘటన జరిగినప్పుడు రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ నెలకొంది. పౌరులు వస్తూ, వెళ్తున్నారు, కానీ ఎవరూ యువకుడిని రక్షించడానికి ప్రయత్నించక‌పోవ‌డం శోచ‌నీయం

రెండు నెలల క్రితం మూడు హత్యలు

క‌ర్టాట‌క‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇదే తొలిసారి కాదు.. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. రెండు నెలల క్రితం మంగళూరులో ముసుగులు ధరించిన కొందరు దుండగులు ఓ యువకుడిని దారుణంగా కొట్టి, ఆపై కత్తితో దాడి చేశారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి పేరు మహ్మద్ ఫాజిల్ గా గుర్తించారు. అంతకుముందు జూలై 26న దక్షిణ కన్నడ జిల్లాలో భారతీయ జనతా యువమోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారును నరికి చంపారు. దక్షిణ కన్నడలోనే జూలై 19న మహ్మద్ మసూద్‌పై ఎనిమిది మంది దాడి చేశారు. అతను కూడా చికిత్స పొందుతూ చనిపోయాడు.

Follow Us:
Download App:
  • android
  • ios