Asianet News TeluguAsianet News Telugu

ముస్లిం బాలికను ఇంట్లో డ్రాప్ చేశాడని హిందూ బాలుడిపై దాడి.. ఆమెతో ఎందుకు ఉన్నావని ప్రశ్నలు..

మధ్యప్రదేశ్ లో హిందూ యువకుడితో కలిసి ముస్లిం యువతి డిన్నర్ కు వెళ్లిందని కొందరు దుండగులు దాడి చేసిన ఘటన మరవక ముందే.. కర్ణాటకలో కూడా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం బాలికను ఇంటి వద్ద డ్రాప్ చేశాడని హిందూ బాలుడిపై ఓ గుంపు దాడి చేసింది. 

 

 

A Hindu boy was attacked for dropping a Muslim girl at home.. Incident in Karnataka..ISR
Author
First Published May 30, 2023, 12:23 PM IST

ఆ బాలుడు, బాలిక పారామెడికల్ స్టూడెంట్స్. ఒకే కాలేజీలో కలిసి చదువుకుంటున్నారు. కానీ వారిద్దరివీ వేరే మతాలు. బాలిక ముస్లిం మతానికి చెందినది కాగా.. బాలుడు హిందూ మతానికి చెందిన వాడు. కానీ వారికి అలాంటివేవీ తెలియదు. మనసులో ఎలాంటి కల్మశం లేకుండా స్నేహంతో ఉంటున్నారు. ఈ క్రమంలో ఒక రోజు ఆ బాలుడు ఆ బాలికను ఇంటి వద్ద డ్రాప్ చేశాడు. దీనిని ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు గమనించారు. ఆ బాలికతో ఎందుకు ఉన్నావంటూ ప్రశ్నిస్తూ దాడి చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. 

అర్ధరాత్రి కుదిరిన సయోధ్య.. గెహ్లాట్, పైలట్ మధ్య విభేదాలు తొలగించిన కాంగ్రెస్.. బీజేపీని ఎదిరిస్తామని ప్రతిజ్ఞ

కర్ణాటకలో రాష్ట్రం శివమొగ్గ జిల్లాలోని భద్రావతి ప్రాంతంలో ఓ మోరల్ పోలీసింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు, ‘టైమ్స్ నౌ’ కథనం ప్రకారం.. ముస్లిం మతానికి  చెందిన బాలిక, హిందూ మతానికి చెందిన బాలుడు ఒకే కాలేజీలో పారామెడికల్ కోర్సు చదువుతున్నారు. వీరిద్దరూ స్నేహంగా ఉండేవారు. ఈ క్రమంలో ఆ బాలుడు తన క్లాస్ మేట్ అయిన ముస్లిం బాలికను ఇంటి వద్ద డ్రాప్ చేశాడు. దీనిని ఆ బాలిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు గమనించారు. 

ఆ బాలుడిని అడ్డగించి గుంపుగా దాడి చేశారు. చెంపదెబ్బ కొడుతూ ఆ బాలికతో ఎందుకు ఉన్నావని ప్రశ్నించారు. ఈ ఘటనపై బాలుడు భద్రావతిలోని ఓల్డ్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉందని భావిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.

కళ్ల ముందే కడతేరుస్తున్నా అడ్డుకోని జనం.. బాలికను చంపిన కొన్ని సెకన్లకే ఫోన్ ఆఫ్ చేసి, బస్సులో వెళ్లిన సాహిల్

కాగా.. గత నెలలో ఇదే కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ఉజిరే సమీపంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళా హిందూ స్నేహితురాలితో మాట్లాడినందుకు ఒక ముస్లిం యువకుడిపై హిందూ వర్గానికి చెందిన ముఠా దాడి చేసింది. ఆ యువకుడిని బస్సు నుంచి బయటకు లాగారు. అనంతరం ఆ బస్సులోని ప్రయాణికుల ముందే అతడిని చితకబాదారు. 

గత వారం మధ్యప్రదేశ్ లో ఈ తరహా ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇండోర్ సిటిలో డిన్నర్ చేసి హోటల్ నుంచి బయటకు వస్తున్న ఓ ముస్లిం యువతి, ఓ హిందూ యువకుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఆ యువకుడిని చుట్టుముట్టి చితకబాదారు. తన తల్లిదండ్రుల అనుమతితోనే డిన్నర్ కు వచ్చానని ఆ యువతి వారికి చెప్పింది. అయినా కూడా ఆ దుండుగులు వినకుండా ఆమెను కూడా కొట్టి ఇస్లాం మతాన్ని అణగదొక్కొద్దని హెచ్చరించారు. 

ఘోర రోడ్డు ప్రమాదం.. జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి

గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఆ జంట బైక్ పై కూర్చొని ఉంది. వారిని ముస్లిం వర్గానికి చెందిన 20 మంది యువకులు వెంబడించి మరీ అడ్డుకున్నారు. తన తల్లిదండ్రులకు చెప్పి, వారి అనుమతితోనే ఆ యువకుడితో డిన్నర్ కు వచ్చానని ఆ యువతి చెప్పడం ఆ వీడియోలో వినిపిస్తోంది. అయినా వారు వినలేదు. ఆ గుంపులోని ఓ వ్యక్తి రాత్రిపూట అబ్బాయితో ఎందుకు బయటకు వచ్చావని ఆమెనే దబాయించాడు. ‘‘మీరు వేరే మతానికి చెందిన అబ్బాయితో కలిసి డిన్నర్ కు వెళ్లారు. మీరు హిజాబ్ ధరిస్తున్నారు కానీ ఇస్లాంను పాటించడం లేదు... ఇస్లాం మతాన్ని కించపరచకండి. ఇస్లాంను ఎవరూ అణగదొక్కకూడదు’’ అని ఆ వ్యక్తి చెప్పడం వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేశ్ రఘువంశీ తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios