ఒడిశాలోని మయూర్భంజ్లో బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
ఒడిశా రాష్ట్రంలోని మయూర్భంజ్ జిల్లాలో శుక్రవారం ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికుల సాయంతో పోలీసులు హాస్పిటల్ కు తరలించారు.
ఒడిశాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మయూర్భంజ్ జిల్లాలో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు నిర్ధారించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని చెప్పారు.
అన్నను చంపి, శవాన్ని మంచం కింద దాచిపెట్టాడు.. తండ్రి సాయంతో పారేసి.. చివరికి..
ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బస్సు ప్రయాణికులను తీసుకొని ఖిచింగ్ నుండి బరిపాడకు నేషనల్ హైవే నెంబర్ 18పై వెళ్తోంది. ఈ క్రమంలో కులియానా చౌక్ సమీపంలోకి చేరుకునే సరికి బోల్తా పడింది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులందరినీ స్థానికుల సహాయంతో బరిపాడలోని పండిట్ రఘునాథ్ ముర్ము మెడికల్ కాలేజీ, హాస్పిటల్ కు తరలించారు.