ఘోర ప్రమాదం, పెళ్లికి వెళ్లి వస్తున్న బస్సుని ఢీకొన్న మరో బస్సు, 7గురు మృతి
పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ బస్సు టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో.. బస్సుని రోడ్డు పక్కన నిలిపివేయగా.. మరో బస్సు వేగంగా వచ్చి దీనిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరప్రదేశ్ లో ఘెర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొని ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లాహర్వాన్ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
ఆగ్రా-చందౌసీ హైవే పై బహజోయి పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ బస్సు టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో.. బస్సుని రోడ్డు పక్కన నిలిపివేయగా.. మరో బస్సు వేగంగా వచ్చి దీనిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
తీవ్రగాయాలపాలైన మరో ఎనిమిది మందిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మృతులు విర్పాల్(60), హప్పు(35), చోటే(40), రాకేష్(30), అభయ్(18), వినీత్(30), భురే(25) గా గుర్తించారు. వీరంతా పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా.. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ మంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ ఘటనపై ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.