ప్రియురాలితో శృంగారంలో ఉండగా గుండెపోటు.. 67యేళ్ల వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్...
బెంగళూరులో ఓ 67 ఏళ్ల వ్యక్తి తన ప్రియురాలితో సెక్స్లో ఉండగా గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో తాను పట్టుబడిపోతాననే భయంతో మహిళ తన భర్త, సోదరుడితో కలిసి చేసిన పని చర్చనీయాంశంగా మారింది.
బెంగళూరు : బెంగళూరులో ప్లాస్టిక్ సంచిలో 67 ఏళ్ల వ్యక్తి మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ మరణంపై పోలీసుల దర్యాప్తులో ఆ వ్యక్తి తన ప్రియురాలితో సెక్స్ చేస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడని తేలింది. వ్యక్తి మృతదేహాన్ని అతని ప్రియురాలు, ఆమె భర్త , ఆమె సోదరుడు పారవేశారని తేల్చారు.
67 ఏళ్ల వ్యాపారవేత్త తనింట్లో పనిచేసే 35 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు నవంబర్ 16న తన ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమెతో శృంగారంలో ఉండగా హార్ట్ ఎటాక్ రావడంతో మంచంపైనే మృతి చెందాడు. అది చూసిన ఆ మహిళ భయంతో వణికిపోయింది. ఇది బైటికి వస్తే సమాజంలో తన పరువు పోతుందని భయపడింది. వెంటనే భర్త, సోదరుడికి ఫోన్ చేసింది. విషయం మొత్తం చెప్పింది. వెంటనే ఇంటికి వచ్చిన వారు.. వ్యాపారవేత్త మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్లో ప్యాక్ చేసి జెపి నగర్లోని ఏకాంత ప్రదేశంలో పడేశారు.
మూడు పెళ్లిళ్లు.. బీమా డబ్బు కోసం.. రెండో భార్యను ఆత్మహత్య చేసుకోమంటూ భర్త వేధింపులు..
వివరాల్లోకి వెడితే.. మృతుడిని జేపీ నగర్లోని పుట్టెనహళ్లి నివాసి బాల సుబ్రమణియన్గా గుర్తించారు. ఆయన నవంబర్ 16న తన మనవడిని బ్యాడ్మింటన్ క్లాస్ లకు దింపేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. సాయంత్రం 4.55 గంటల ప్రాంతంలో బాలా తన కోడలికి ఫోన్ చేసి, తనకు రావడం ఆలస్యమవుతుందని కొంచెం పర్సనల్ పని ఉందని చెప్పాడు. అలా వెళ్లిన వ్యక్తి తిరిగిరాలేదు.
దీంతో అతని కోసం ఎదురుచూసి, పోన్ చేసిన కలవకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. బాలా కుమారుడు సుబ్రమణ్య నగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ ఫిర్యాదు నమోదైన ఒక రోజు తర్వాత, ప్లాస్టిక్ కవర్లు, బెడ్షీట్లో ప్యాక్ చేసి అనుమానాస్పద స్థితిలో బాలా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.
దర్యాప్తులో ఆయన చివరగా ఆమె ఇంటికి వెళ్లినట్లు తేలింది. దీంతో ఆ మహిళను ప్రశ్నించగా, 67 ఏళ్ల ప్రియుడి మృతదేహాన్ని తామే పారవేసినట్లు ఒప్పుకుంది. చనిపోవడంతో తాను భయపడ్డానని పోలీసులు తనపై హత్య కేసు నమోదు చేస్తారేమోనన్న భయంతో భర్త, సోదరుడి సాయంతో మృతదేహాన్ని రోడ్డుపై పడేశానని చెప్పుకొచ్చింది. కాగా, బాల సుబ్రమణ్యం ఆ మహిళతో చాలా కాలంగా సంబంధంలో ఉన్నాడని, తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడని వెల్లడైంది. బాలాకు గతేడాది యాంజియోప్లాస్టీ సర్జరీ చేయించుకున్నాడు.
దీనిమీద పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC) కి సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళ చేసిన వాదనలు నిజమో కాదో నిర్ధారించడానికి వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపారు.