Asianet News TeluguAsianet News Telugu

మూడు పెళ్లిళ్లు.. బీమా డబ్బు కోసం.. రెండో భార్యను ఆత్మహత్య చేసుకోమంటూ భర్త వేధింపులు..

ముగ్గురు యువతుల్ని పెళ్లి పేరుతో మోసం చేసి.. రెండో భార్యను ఆత్మహత్య చేసుకోమంటూ వేధించిన ఓ వ్యక్తి ఉదంతం నంద్యాలలో వెలుగు చూసింది. 

husband harassed wife to commit suicide over bheema money in nandyal
Author
First Published Nov 25, 2022, 11:21 AM IST

నంద్యాల : ఓ వ్యక్తి భార్యను చిత్రహింసలు పెట్టాడు. అంతేకాదు. ఆత్మహత్య చేసుకుంటే బీమా వస్తుందంటూ వేదించాడు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది. ఓ యువకుడు ముగ్గురు యువతులను పెళ్ళి చేసుకుని.. వారిని మోసగించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన మహేంద్రబాబుకు మార్కాపురానికి చెందిన ఓ మహిళతో మొదట వివాహం జరిగింది. అయితే తనకు పెళ్లైన  విషయాన్ని దాచిపెట్టి.. తన గ్రామానికే చెందిన ఇంకో మహిళతో ప్రేమాయణం సాగించాడు. ఆమెను ప్రేమించి నాలుగేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నాడు. 

ఆ తరువాత ఆమె పేరు మీద బీమా చేయించాడు. రెండో భార్య ఆత్మహత్య చేసుకుంటే.. ఆ బీమా డబ్బులు తమకు వస్తాయని తరచూ తల్లి దగ్గర ప్రస్తావించేవాడు. ఈ క్రమంలో డబ్బుల మీద ఆశతో ఆత్మహత్య చేసుకోవాలని భార్యను బలవంతం చేయసాాగాడు. ఆ వేధింపులు భరించలేక ఆమె అతడిని విడిచి హైదరాబాద్ కు వెళ్లిపోయింది. దీంతో సదరు రెండుపెళ్లిళ్ల మోసగాడు... మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. రెండో భార్య వదిలి వెళ్లిన మూడేళ్ల తరువాత మహేంద్రబాబు  కృష్ణా జిల్లా చల్లపల్లి మండల వక్కలగడ్డ గ్రామానికి చెందిన మరో మహిళతో పరిచయం పెంచుకున్నాడు. తనకు పెళ్లి కాలేదని ఆమెను నమ్మించాడు. ఆ తరువాత ఆ యువతిని మూడో పెళ్లి చేసుకున్నాడు. 

పెల్లైన తరువాత తన నిజస్వరూపం బయటపెట్టాడు. ఆమె నుంచి రూ.5 లక్షలు, ఆమె తల్లి ఫోన్ ద్వారా ప్రైవేట్ లోన్ యాప్ నుంచి రూ.5 లక్షలు రుణం తీసుకున్నాడు. మూడో పెళ్లి విషయం రెండో భార్యకు తెలిసింది. దీంతో ఆమె మహేంద్రబాబు మీద, అతని తల్లి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ ఇద్దరిమీద కేసు నమోదు చేశారు. ఈ ఘటన మీద దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపాలు గురువారం తెలిపారు. 

కడప ట్రిపుల్ ఐటీలో ఇంటర్ విద్యార్ధి ఈశ్వర్ సూసైడ్

ఇదిలా ఉండగా, 

బీహార్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ పెద్దలు అని చెప్పుకునే కొంతమంది.. ఇచ్చిన తీర్పు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉంది. ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి విధించిన శిక్ష న్యాయవ్యవస్థనే అపహాస్యం చేసేలా ఉంది. వివరాల్లోకి వెడితే.. 
కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలనుకున్నారు.

కానీ, ఈ విషయంలో జోక్యం చేసుకున్న పంచాయతీ పెద్దలు దారుణమైన తీర్పు ఇచ్చారు. ఘటనను బయటికి రాకుండా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి ఐదు గుంజీల శిక్ష విధించారు. ఆ శిక్షతో అతడిని వదిలిపెట్టేశారు. దీంతో ఈ శిక్ష ఇప్పుడు చర్చనీయాంశంగా మారడం గమనార్హం. అరుణ్ పాండ్యన్ అనే వ్యక్తి నవాదా ప్రాంతంలోని ఓ గ్రామంలో ఉన్న కోళ్ల ఫారంలో పని చేసేవాడు. కొన్నాళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ చిన్నారిపై కన్నేశాడు. ఆ చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపించి.. తీసుకెళ్లాడు. ఆ తరువాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెలుతుండగా.. నిందితుడు పనిచేస్తున్న కోళ్ల ఫారం యజమాని ఇందులో జోక్యం చేసుకున్నాడు. పోలీసులు దాకా వెడితే సమస్యలు వస్తాయని పంచాయతీలో ఆ విషయాన్ని తేల్చుకోవాలని సూచించాడు. అతని మాట తీసేయలేక వారు పంచాయతీ పెద్దలను ఆశ్రయించారు. వారు గ్రామస్తులందరి ముందు నిందితుడికి 5 గుంజీలను శిక్షగా విధించారు. ఆ తరువాత అతడిని వదలి పెట్టారు. ఈ శిక్ష మీద గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ పంచాయతీ, శిక్షలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆ పంచాయతీ తీర్పు మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్ళింది. దీంతో ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios