కాలువలో పడినకారు.. ఒకే కుటుంబానికిచెందిన 6గురు మృతి
కారు అదుపు తప్పి కాలువలో పడి... ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కన్నుమూశారు.
కారు అదుపు తప్పి కాలువలో పడి... ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కన్నుమూశారు. ఈ విషాదకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. కోయంబత్తూరు నుంచి పొల్లాచి వెళ్తున్న కారు అదుపు తప్పి పరంబికుళం అల్లైర్ కాలువలో పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురు మృత్యువాత పడ్డారు.
మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. డ్రైవర్ కారు వేగాన్ని నియంత్రించడంలో విఫలం కావడం వల్లే ప్రమాదం వాటిల్లింది. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పొల్లాచి జనరల్ హాస్పిటల్ కి తరలించారు . ఈ మేరకు కేసు నమోదు చేసుకొన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.