తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నామక్కల్ ప్రాంతలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా బిహార్ వాసులుగా గుర్తించారు.
తమిళనాడులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నామక్కల్ ప్రాంతలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా బిహార్ వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా... ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.