Asianet News TeluguAsianet News Telugu

లోయలో పడిన బస్సు: ఆరుగురు మృతి 15 మందికి గాయాలు

గర్హ్వా నుంచి జార్ఖండ్ వెళ్తున్న బస్సు తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో రక్షణ గోడను ఢీకొట్టి లోతైన ప్రవాహంలోకి పడిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. 

6 dead, 15 injured after bus falls in ditch in Jharkhand
Author
Jharkhand, First Published Jun 25, 2019, 8:14 AM IST

రాంచీ: జార్ఖండ్ లోని గర్హ్వాలో బస్సు ప్రమాదం సంభవించింది. బస్సు లోయలో పడిపోవడంతో ఆరుగురు మరణించగా, 15 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 39 మంది ఉన్నారు. మరో 12 మంది ఇంకా బస్సులోనే ఉన్నారు. మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. 

గర్హ్వా నుంచి జార్ఖండ్ వెళ్తున్న బస్సు తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో రక్షణ గోడను ఢీకొట్టి లోతైన ప్రవాహంలోకి పడిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. 

గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిచారు. కుల్లు బస్సు ప్రమాదంలో 44 మంది మణించి వారం కూడా గడవక ముందే మరో ప్రమాదం సంభవించింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios