ఒడిశాలో ఓ ఎమ్మెల్యే 56యేళ్ల వయసులో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. కుటుంబపరిస్థితుల వల్ల చదువుకోలేకపోయానని.. ఇప్పటికైనా పదో తరగతి పూర్తి చేయాలనుకుంటున్నానని అన్నారు. 

ఒడిశా : ఒడిశా రాష్ట్రంలోని కొంధమాల్ జిల్లా పూల్భాణీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే (బిజద) అంగద kahaar 56 ఏళ్ల వయసులో పదో తరగతి ఆంగ్ల పరీక్ష రాశారు. శుక్రవారం పితాబరిలోని rujangi ఉన్నత పాఠశాలలోని స్టేట్ ఓపెన్ స్కూలింగ్ సర్టిఫికెట్ (ఎస్ఓఎస్ సీ)కేంద్రంలో ఆయన పరీక్ష రాశారు. ఉదయం చేతిలో అడ్మిట్ కార్డుతో మిగిలిన విద్యార్థులతో కలిసి ఆయన కేంద్రం బయట నిలుచుని కనిపించారు. కుటుంబ సమస్యల కారణంగా చదువు మధ్యలో ఆపేశానని, దీంతో పదో తరగతి పరీక్షలు రాయలేకపోయానని అంగద కహర్ తెలిపారు. తనకన్నా ఎక్కువ వయసున్నవారు కఠినంగా శ్రమించి చదువు పూర్తి చేసిన విషయం తెలుసుకున్నాని.. అతని కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహంతో పరీక్షలు రాస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణుడవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.