Asianet News TeluguAsianet News Telugu

లిఫ్ట్ ఇస్తానని చెప్పి... నలభై ఏళ్ల మహిళపై కుర్రాడి అత్యాచారం, హత్య

లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఓ వివాహితను బైక్ ఎక్కించుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. అనంతరం దారుణంగా హత్య చేశాడు. కర్ణాటకలోని బెళగావికి చెందిన మంజునాథ్ దొడ్డమణి అనే 23 ఏళ్ల యువకుడు ఓల్డ్ గోవాలో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు

23 yr man arrested for raping, murderd middle aged woman
Author
Goa, First Published Oct 15, 2018, 11:45 AM IST

లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఓ వివాహితను బైక్ ఎక్కించుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. అనంతరం దారుణంగా హత్య చేశాడు. కర్ణాటకలోని బెళగావికి చెందిన మంజునాథ్ దొడ్డమణి అనే 23 ఏళ్ల యువకుడు ఓల్డ్ గోవాలో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు.

ఈ క్రమంలో మంజునాథ్ బైక్‌పై వెళుతుండగా .. గత బుధవారం రాత్రి బస్టాప్ వద్ద ఒంటరిగా నిలుచుని బస్సు కోసం ఎదురుచూస్తోన్న 40 ఏళ్ల వివాహిత కనిపించింది. లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఆమెను బైక్‌పై ఎక్కించుకుని ఓ నిర్మానుష్య ప్రదేశం వైపుగా తీసుకెళ్లి వివాహితపై అత్యాచారం చేశాడు.

అనంతరం ఆమెను గొంతునులిమి హత్య చేసి.. మృతదేహాన్ని పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో పనాజీకి పది కిలోమీటర్ల దూరంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం పడివుందని పోలీసులకు సమాచారం అందడంతో .. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మృతురాలిపై అత్యాచారం చేసి అనంతరం గొంతునులిమి చంపినట్లుగా వైద్యులు తెలిపారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios