Asianet News TeluguAsianet News Telugu

మూగ, చెవుడు యువతిపై సామూహిక అత్యాచారం, ఐదుగురు అరెస్ట్

22ఏళ్ల బదిర యువతి మార్కెట్ కి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఆమెను ఐదుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. బలవంతంగా యువతిని ద్విచక్రవాహనం ఎక్కించుకొని నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువతిని అక్కడే వదిలేసి వాళ్లు పరారయ్యారు.

22-yr-old deaf, speech impaired woman gangraped in Chhattisgarh; 5 arrested
Author
Hyderabad, First Published Aug 28, 2019, 11:31 AM IST


మూగ, చెవుడు యువతిపై ఐదుగురు వ్యక్తులు కర్కశంగా ప్రవర్తించారు. మూగపిల్ల అనే కనికరం కూడా లేకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా... నిందితులు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఛత్తీస్ గడ్ లో ని బిలాస్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బిలాస్పూర్ జిల్లాలోని మారవాహి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 25వ తేదీ రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 22ఏళ్ల బదిర యువతి మార్కెట్ కి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఆమెను ఐదుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. బలవంతంగా యువతిని ద్విచక్రవాహనం ఎక్కించుకొని నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువతిని అక్కడే వదిలేసి వాళ్లు పరారయ్యారు.

ఆ తర్వాత యువతి ఇంటికి చేరుకొని తన తల్లి, అత్తలకు సైగల ద్వారా తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో బాధితురాలి తల్లి వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చింది. నిందితులపై ఫిర్యాదు చేసింది. కాగా... ఓ టీచర్ ని తీసుకువచ్చి... బాధిత యువతి ఏం చెబుతుందో పోలీసులు ఆమె ద్వారా తెలుసుకున్నారు.

ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులు డోలె కుజూర్, సంజీవ్ కుమార్ , సూరజ్ లహ్రే, కృష్ణ కుజూర్, గౌరీ శంకర్ లు గా గుర్తించారు. వారిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios